ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు (AP Govt Schools) ఉచిత విద్యుత్ (Free Current )అందించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)ప్రకటించారు. విద్యాసంస్థల అభివృద్ధికి ఇది ఒక కీలకమైన నిర్ణయమని ఆయన తెలిపారు. ఉచిత విద్యుత్ వల్ల విద్యాసంస్థల నిర్వహణలో వచ్చే ఆర్థిక భారం తగ్గుతుందని, విద్యార్థులు, టీచర్లు మరింత అనుకూలమైన వాతావరణంలో విద్యను అభ్యసించగలరని తెలిపారు. విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు.
Jagan : జగన్ కుట్రలను ఇంటిలిజెన్స్ పసిగట్టలేకపోయింది
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో విద్యుత్ బిల్లులు ఒక ప్రధాన భారం. ఉచిత విద్యుత్ అందించడంతో, స్కూళ్ల పరిపాలనపై స్థానిక సంస్థలకు మేలు జరుగుతుందని, విద్యార్ధుల అభ్యాసానికి అవసరమైన సౌకర్యాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్లో పెద్ద మొత్తాన్ని కేటాయించిందని లోకేశ్ వెల్లడించారు. పాఠశాల విద్యకు రూ. 31,805 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 3,506 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఈ నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ నిర్ణయం ద్వారా విద్యార్ధులకు మెరుగైన విద్యా వాతావరణం లభించడంతో పాటు, విద్యా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. విద్యుత్ సమస్యల వల్ల తరగతులు అడ్డంకులు ఎదుర్కొనే పరిస్థితి లేకుండా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు. విద్యను సమానంగా అందించే దిశగా ప్రభుత్వం కీలకమైన సంస్కరణలు తీసుకురావాలని భావిస్తోంది. ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, పాఠశాలల మరమ్మతులు, స్మార్ట్ తరగతి గదుల ఏర్పాటుపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.