ప్రస్తుతం సోషల్ మీడియా ను ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలు తాము చేసిన అభివృద్ధి , చేసిన పనులు ఇలా ప్రతి ఒక్కటి షేర్ చేస్తూ ప్రజల్లో నిలుస్తున్నారు. కొన్ని సార్లు తెలియక చేసిన తప్పులు వారిని వార్తల్లో నిలిచేలా చేస్తాయి. అలాగే అప్పుడప్పుడు తప్పుడు పోస్ట్ లు చేసి , వాటిని వెంటనే సరిద్దికోవడం చేస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విషయంలో నారా లోకేష్ అదే చేసాడు. తాజాగా నారా లోకేష్ (Nara Lokesh) ట్వీట్ చేసిన ఒక అంశం ఈ విషయానికి మంచి ఉదాహరణగా నిలిచింది. కడపలో నిర్మించిన ‘స్మార్ట్ కిచెన్’ (Smart kitchen) గురించి లోకేష్ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈ క్యాంటీన్ ద్వారా ప్రతి రోజు 12 ప్రభుత్వ పాఠశాలలకు, 2200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా అవుతోందని పేర్కొన్నారు. ఇదే తరహాలో మరిన్ని స్మార్ట్ కిచెన్లు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు.
Jasprit Bumrah: బౌలర్ బుమ్రా ఎందుకు తరచూ గాయపడుతున్నాడు?
అయితే కాసేపటికే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ఓ ట్వీట్ వచ్చింది. గత ఏడాది మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన పర్యటనలో జిల్లా కలెక్టర్ సూచించిన ‘స్మార్ట్ కిచెన్’ ఆలోచనకు, అవసరమైన నిధులను తన వ్యక్తిగత ఖర్చుతో అందించానని పవన్ స్పష్టం చేశారు. ఈ కిచెన్ నుంచే ఇప్పుడు 12 పాఠశాలలకు ఆహారం తయారవుతుందని, ఇది ఆదర్శంగా నిలుస్తుందంటూ పవన్ వివరించారు. వాస్తవానికి ఈ స్మార్ట్ కిచన్ కు డబ్బంతా పవన్ కళ్యాణ్ ఇస్తుండగా..లోకేష్ ఆయన పేరు ప్రస్తావించకపోయేసరికి పవన్ టీం ఆ విధంగా ట్వీట్ చేయాల్సి వచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో లోకేష్ తన ట్వీట్ను తక్షణమే డిలీట్ చేయించేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల సోషల్ మీడియా అకౌంట్లను ఎక్కువగా మేనేజ్మెంట్ టీములు చూస్తుంటాయి. అప్పుడప్పుడు వారు పంపిన సమాచారం పూర్తిగా పరిశీలించకుండా ట్వీట్ చేసి వివాదానికి తెరలేపుతుంటారు. అయితే లోకేష్ ఈ విషయాన్ని గుర్తించి వెంటనే స్పందించటం, రాజకీయాల్లో బాధ్యతాయుతమైన ఆచరణగా అభివర్ణించవచ్చు. పవన్ కల్యాణ్ ఇచ్చిన నిధుల ప్రస్తావన లేకుండా పోవడం వల్ల జరిగిన ఈ చిన్న అపార్థం, చివరికి పరస్పర గౌరవాన్ని కాపాడే చర్యలతో ముగిసింది.
Lokesh Kichen Tweet
డొక్కా సీతమ్మ గారి పేరిట బడి పిల్లలకు అందిస్తున్న భోజనం పరిశుభ్ర, ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో ‘స్మార్ట్ కిచెన్’ను నిర్మించారు.
గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్… pic.twitter.com/tXnmjUdGcT
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) July 10, 2025