Nara Lokesh : ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తైన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన “ప్రజాస్వామ్యం గెలిచిన రోజు” అంటూ భావోద్వేగపూరితంగా ట్వీట్ చేశారు. విధ్వంస పాలనపై ప్రజలు గెలిచిన రోజు ఇదే అని గుర్తుచేశారు.
నారా లోకేశ్ మాట్లాడుతూ, “అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయి. ఇది ఐదు కోట్ల ప్రజల గెలుపు. గతంలో ప్రజలపై జరిగిన అన్యాయానికి ఇది న్యాయం.. ప్రజల తీర్పు మా బాధ్యతను మరింత పెంచింది,” అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ప్రారంభమైందని వెల్లడించిన లోకేశ్, చంద్రబాబు పాలన అనుభవం, పవన్ కళ్యాణ్ ఆశయ దృక్పథం, ప్రధాని మోదీ ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధిపథంలో ముందుకెళ్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రజల విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
“ప్రజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఈ స్పూర్తితో ప్రజల ఆశల్ని నెరవేర్చేందుకు పనిచేస్తాం. ఐదు కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపేందుకు అంకితభావంతో ముందుకెళ్తాం. ప్రజా తీర్పుదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు,” అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
కూటమి పాలన ప్రారంభమై ఏడాది దాటిన సందర్భంగా ఈ ప్రకటనను మంత్రిగా ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందేశం కూటమి ప్రభుత్వ ప్రజాభిమానాన్ని పటిష్టం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరోసారి తెలియజేసింది.
Massive Accident : మధ్యప్రదేశ్ ఝాబువాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి..
#PrajaTeerpuDinam
ప్రజాస్వామ్యం గెలిచిన రోజుసరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయి. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు. ప్రజా తీర్పు మా కూటమి బాధ్యతను మరింత పెంచింది. @ncbn గారి పాలనానుభవం,… pic.twitter.com/iqtdgipDLl
— Lokesh Nara (@naralokesh) June 4, 2025