Site icon HashtagU Telugu

Nara Lokesh : ఇంకొల్లులో డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్

We organized Yoga Andhra to gift the Prime Minister a Guinness record: Lokesh

We organized Yoga Andhra to gift the Prime Minister a Guinness record: Lokesh

Nara Lokesh : రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సోమవారం బాపట్ల జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా, ఇంకొల్లు మండలంలోని గంగవరం రోడ్డులో ఏర్పాటు చేసిన డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ స్కూల్‌ను మాజీ మంత్రి డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన లోకేశ్‌ స్కూల్ ప్రధాన భవనంతో పాటు, కంప్యూటర్ సైన్స్ ల్యాబ్, బాలురు బాలికల వసతి గృహాలు, క్యాంటీన్, మెస్ భవనాలను ప్రారంభించారు. అంతేగాక, పాఠశాల ప్రాంగణంలో దగ్గుబాటి చెంచురామయ్య, దగ్గుబాటి నీలమోహన్ విగ్రహాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

బాపట్ల పర్యటన సందర్భంగా, మంత్రి లోకేశ్‌కు జె.పంగులూరు, ఆరికట్లవారిపాలెం, గంగవరం వంటి ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు, పూలమాలలతో ఆయనకు ఆత్మీయ ఆహ్వానం అందించారు. ప్లకార్డులు, బాణసంచాలతో కూడిన ఆత్మీయ స్వాగతం ఆయన పట్ల ప్రజల్లో ఉన్న అభిమానాన్ని స్పష్టంగా చూపించింది. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రతి గ్రామంలో ప్రజలను ఆప్యాయంగా పలుకరించిన లోకేశ్‌, వారి సమస్యలు నేరుగా విని, తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సైనిక్ స్కూల్ వంటి విద్యాసంస్థలు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ, భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

Avinash Reddy : ఎంపీ అవినాశ్‌ రెడ్డి అనుచరులపై కేసు నమోదు