Site icon HashtagU Telugu

Landslides in Vijayawada : విజయవాడలో మరోసారి విరిగిపడిన కొండచరియలు

Landslides In Mughalrajapur

Landslides In Mughalrajapur

Landslides in Moghalrajpuram Vijayawada : పది రోజుల క్రితం ఎడతెరపిలేని వర్షం విజయవాడ (Vijayawada ) నగరాన్ని జలమయం చేసిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో ఒకే రోజు 29 సెం,మీ వర్షం పడేసరికి వన్​టౌన్​, గురునానక్​ కాలనీ, చుట్టుగుంట, కృష్ణలంక, రామలింగేశ్వరనగర్​లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బందర్​ రోడ్డు, ఏలూరు రోడ్డు సహా బెంజ్​ సర్కిల్​ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. నిర్మలా కాన్వెంట్​ ప్రాంతం చెరువును తలపించింది. అలాగే ఏపీఐఐసీ కాలనీ రోడ్డు , మొగల్రాజపురంలో పాలి క్లినిక్​ రోడ్డు , పాతబస్తీ పంజా సెంటర్​లో మినార్​ మసీదు, సింగ్​నగర్​లో ఇళ్లు ఇలా అన్ని ప్రాంతాలు మనిగాయి.

ఇప్పుడిప్పుడే ఆ వరదల్లో నుండి ప్రజలు కోలుకుంటున్నారు. అలాగే మొగల్రాజపురం(Moghalrajpuram )లో కొండచరియలు (Landslides ) విరిగిపడి నలుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇంద్రకీలాద్రిపైనా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దేవస్థానానికి చెందిన సమాచార కేంద్రం ధ్వంసమైంది. పెద్ద బండరాళ్లు, ఒక్కసారిగా జారిపడడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలన్నీ ఇంకా మరచిపోకముందే మరోసారి విజయవాడ మాచవరంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారమివ్వగా వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Read Also : Siddaramaiah Losing Top Post : నేనెందుకు సీఎం కాకూడదో చెప్పండి.. సిద్ధరామయ్య సలహాదారుడి సంచలన కామెంట్స్