AP Politics: గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, ఎన్టీఆర్ 2 ఎన్టీఆర్ బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టిఆర్ ను చంపిన వ్యక్తులే నేడు పూజలు చేస్తున్నారని, చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నానని, ప్రతి ఏటా ఆయన వర్ధంతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా అని ఆయన అన్నారు.
చంద్రబాబు కదలి రా అని తిరుగుతుంటే….కోర్టులు జైలుకు కదలి వెళ్లి అంటున్నాయని సెటైర్స్ వేశారు. బాడీలో పార్టీలు పని చేయడం లేదని చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారని, బాలకృష్ణ ,చంద్రబాబు లాంటి వారు వెయ్యి మంది కలిసి వచ్చిన జూ. ఎన్టీఆర్ ను ఎం చెయ్యలేరని.. ఫ్లెక్సీలు తొలగించడం తప్ప అని స్పందించారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు మూడు సార్లు గుడివాడలో పర్యటించి తనకు డిపాజిట్లు ఉండవన్నారు ఎం జరిగింది…తిరిగి ఇప్పుడు అదే జరుగతోంది నాని అన్నారు.
చంద్రబాబును గుడివాడలో పట్టించుకునే వారు ఎవరున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు రా కదలి రా సభలో 5వేల కుర్చిలు వేస్తే.. లక్ష మంది ఎలా వస్తారని అన్నారు. సీఎం జగన్, పార్టీలో పికేసిన వాళ్ళే బయటకు వెళ్తున్నారని, పది రోజులైతే టిడిపి, జనసెన నేతలు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటారని మండిపడ్డారు. ఒక్క శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వస్తె తమకు వచ్చే నష్టం లేదని నాని అన్నారు.