Crime: కడప జిల్లా చాపాడు మండలంలో చోటుచేసుకున్న భయానక హత్య కేసు స్థానిక ప్రజలను షాక్కు గురి చేసింది. పెద్ద చీపాడు గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన ఆలస్యంగా బయటపడింది. అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం ఈ ఘోరానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
గోపాల్ వృత్తిరీత్యా ప్రైవేట్ బస్సు డ్రైవర్. అతని భార్య సుజాతతో గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇంట్లో తరచుగా గొడవలు జరిగేవి. గోపాల్ అనుమానం ప్రకారం, సుజాతకు మరో వ్యక్తితో అనుచిత సంబంధం ఉందని భావించి ఎన్నిసార్లు తగువులు పెట్టుకున్నాడు. కుటుంబ పెద్దలు మధ్యలో వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఈ అనుమానాలు మరింత పెరిగిపోయాయి.
గత రెండు రోజుల క్రితం గోపాల్ కోపంతో ఊగిపోయి తన భార్య సుజాతను హత్య చేశాడు. ఆ తర్వాత ఈ నేరాన్ని దాచిపెట్టడానికి మృతదేహాన్ని వనిపెంట అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పడేశాడు. ఇంత పెద్ద నేరం చేసి కూడా అతని మనసుకు శాంతి లేకపోవడంతో చివరికి గోపాల్ స్వయంగా చాపాడు పోలీస్ స్టేషన్కి వెళ్లి, “నేనే నా భార్యను హత్య చేశాను” అంటూ లొంగిపోయాడు.
ED : బెట్టింగ్ యాప్లపై ఈడీ దర్యాప్తు ముమ్మరం..గూగుల్, మెటాకు నోటీసులు
గోపాల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా చాపాడు పోలీసులు వనిపెంట అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సుజాత మృతదేహాన్ని శోధించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి గోపాల్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
ఈ హత్య కేసు గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. గోపాల్ మరియు సుజాత దంపతులు ఎప్పుడూ గొడవలు పడుతుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. భార్యపై ఇంత క్రూరమైన చర్య తీసుకోవడం స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు.
ఈ సంఘటనతో మరోసారి అనుమానాలు, ఇంటి గొడవలు, అక్రమ సంబంధాల ఆరోపణలు మహిళల ప్రాణాలపై ఎంతటి ప్రభావం చూపిస్తున్నాయో చర్చకు వచ్చింది. కుటుంబ సమస్యలను అర్ధవంతంగా పరిష్కరించకపోవడం, కోపానికి లోనై హింసకు దిగడం వంటి పరిణామాలపై స్థానిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
CPI Leader Chandu Nayak : చందునాయక్ హత్య వెనుక మాజీ మావోయిస్టు రాజేష్ పాత్ర ఉందా..?