వచ్చే ఎన్నికల కోసం సీఎం జగన్మోహనరెడ్డి మాస్టర్ స్కెచ్ వేశారు. మూడు రాజధానుల ఏజండా తో వెళ్ళడానికి సిద్ధం అయ్యారు. విశాఖ గర్జన సూపర్ హిట్ అయిందని భావిస్తున్న వైసీపీ తిరుపతిలో రాయలసీమ గర్జన విజయవంతం అయ్యేలా ప్లాన్ చేస్తుంది. పార్టీలో అసంతృప్తి గా ఉన్న వాళ్ళను సాగనంపడానికి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం వెనుకాడటం లేదు. రెబెల్స్ గా ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యే లను సస్పెండ్ చేయటం ద్వారా తేడా వస్తే వేటు తప్పదని సంకేతం ఇచ్చారు. ఇలా ఒక వైపు పార్టీని చక్కదిద్దుతూ ఇంకోవైపు మూడు రాజధానులు సెంటిమెంట్ తో 2024 ఎన్నికల్లో మిషన్ 175 ఫార్ములాను సక్సస్ చేయాలని వైసీపీ దూకుడుగా వెళ్తుంది. 2024 ఎన్నికలకు ముందే వికేంద్రీకరణ అభివృద్ధి కోసం కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంకు తరలించడానికి మద్దతుగా విశాఖ గర్జన భారీ జన సమీకరణ విజయవంతం కావడంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉత్సాహంగా ఉంది.
గత మూడేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు క్షేత్ర స్థాయి నుంచి పరిస్థితిని సమీక్షించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ప్రారంభించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించడం ప్రారంభించారు.
Also Read: Vijayawada : బెజవాడలో నివాస ప్రాంతాల మధ్య బాణాసంచా దుకాణాలు.. పేలుళ్లతో హడలెత్తుతున్న జనం
మిషన్ 175 లక్ష్యాన్ని సాధించే దిశగా పార్టీ ప్రణాళికలు, వ్యూహాలకు ముప్పు కలిగించే గ్రూప్ లపై చర్యలు తీసుకుంటున్నారు. పార్టీకి, స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ పామర్రు మాజీ ఎమ్మెల్యేలు డీవై దాసు, పొన్నూరుకు చెందిన రావి వెంకట రమణలపై జగన్కు ఫిర్యాదులు అందాయి.విచారణ అనంతరం ఇద్దరు సీనియర్ నేతలను సస్పెండ్ చేసిన జగన్ భవిష్యత్తులో గ్రూపిజం చేసే ఇతర నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై ఇతర వర్గాల నుంచి నివేదికలు అందాయని, వీటిని పరిష్కరించాలని పార్టీ ఇన్ఛార్జ్లను సీఎం ఆదేశించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
విశాఖ గర్జన ఇచ్చిన స్ఫూర్తి 3 రాజధానులకు మద్దతుగా అక్టోబర్ 29న తిరుపతిలో ఇదే తరహాలో ‘రాయలసీమ గర్జన’ ర్యాలీ, సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. రాయలసీమ గర్జనపై ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, ఇతర నేతలు రాయలసీమ నేతలతో సమావేశం నిర్వహించగా మూడు రాజధానుల వల్ల రాయలసీమ అభివృద్ధికి అవకాశం ఉంటుందని నేతలు అభిప్రాయపడ్డారు.
Also Read: MLA Seethakka: కోవర్ట్ రెడ్డిని పక్కన పెట్టాల్సిందే.. వెంకట్ రెడ్డిపై సీతక్క ఫైర్!
రాయలసీమ నాయకులు శ్రీబాగ్ ఒడంబడి స్ఫూర్తితో అమలు చేయాలని కోరుతున్నారు. వికేంద్రీకృత అభివృద్ధి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖపట్నంలో జరిగిన విధంగా కృష్ణాపురం ఠాణా నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సెంటర్ వరకు రాయలసీమ గర్జన ర్యాలీ, బహిరంగ సభ ను తిరుపతిలో అక్టోబర్ 29న నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. వివిధ రంగాలకు చెందిన నాయకులు సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
వీలైనంత త్వరగా వైజాగ్ నుంచి రాష్ట్ర పరిపాలన పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాల) సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలకు స్పష్టం చేశారు.ప్రభుత్వ కార్యాలయాలను వైజాగ్కు తరలించడం ద్వారా ఎన్నికలకు ముందు పరిపాలన వికేంద్రీకరణ అమల్లోకి వస్తుందని, 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో కృషి చేయాలని కోరారు.ఉత్తర ఆంధ్ర జేఏసీలో ముఖ్యపాత్ర పోషిస్తున్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 6 వికేంద్రీకరణకు పిలుపునిస్తోందని, అందుకే మూడు రాజధానులు ఉండటంలో తప్పు లేదని అన్నారు.
Also Read: Telangana : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి తెలంగాణ సర్కార్.. 2వేలకు పైగా.. !
కర్నూలు రాజధానికి 850కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్కు వెళ్లిన ఇప్పుడు వైజాగ్ వెళ్ళగలరని, విశాఖ రాజధానిని ఏర్పాటు చేసుకునేందుకు మంచి అవకాశం లభించిందని ధర్మాన అన్నారు. ఇలా వైసీపీ ప్రయత్నాలు చేయడాన్ని గమనిస్తే 2024 ఎన్నికలు ఏపీ అభివృద్ధి కంటే 3 రాజధానులపై ప్రజా మైండ్ సెట్ ను తిప్పడానికి జగన్మోహరెడ్డి మాస్టర్ స్కెచ్ వేశారన్నమాట.