Andhra Pradesh : నేడు విజ‌య‌వాడ‌లో “జ‌గ‌న‌న్న ఆణిముత్యాలు” కార్య‌క్ర‌మం.. టెన్త్‌,ఇంట‌ర్ టాప‌ర్‌ల‌కు..!

ప్రభుత్వ విద్యాసంస్థ‌ల్లో చదివి టెన్త్‌, ఇంట‌ర్‌లో టాప‌ర్‌లుగా నిలిచిన విద్యార్థుల‌కు ఏపీ ప్ర‌భుత్వం స‌న్మానం చేస్తోంది. రాష్ట్ర

Published By: HashtagU Telugu Desk
CM Jagan Mohan Reddy Green Signal to Group 1 and Group 2 Notifications

CM Jagan Mohan Reddy Green Signal to Group 1 and Group 2 Notifications

ప్రభుత్వ విద్యాసంస్థ‌ల్లో చదివి టెన్త్‌, ఇంట‌ర్‌లో టాప‌ర్‌లుగా నిలిచిన విద్యార్థుల‌కు ఏపీ ప్ర‌భుత్వం స‌న్మానం చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో టెన్త్‌లో టాపర్లుగా నిలిచిన 42 మంది, ఇంటర్మీడియట్‌లో గ్రూప్‌ల వారీగా టాపర్‌లుగా నిలిచిన 26 మంది విద్యార్థులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘జగనన్న ఆణిముత్యాలు’ అవార్డులతో సత్కరిస్తారు. విజ‌య‌వాడ‌లోని ఎ’ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ విద్యార్థులతో పాటు ఐదు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన మరో 20 మంది ఉన్నత విద్యకు చెందిన విద్యార్థులకు స్టేట్ ఎక్సలెన్స్ అవార్డులు అందజేయనున్నారు. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, పతకాలు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తారు. తల్లిదండ్రులను శాలువాలతో సత్కరిస్తారు. ప్రభుత్వం సంబంధిత సంస్థల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌లను జ్ఞాపికతో సత్కరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 22,710 మంది విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’తో అవార్డులు ఇవ్వనుంది.

10వ తరగతికి సంబంధించి, ప్రతి విభాగంలో (జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్ మరియు ట్రైబల్ / సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్) సంస్థల్లో రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, పాఠశాల స్థాయిలలో మొదటి మూడు ర్యాంకుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ఇవ్వ‌నున్నారు. ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో ప్రతి గ్రూప్‌లో అంటే MPC, Bi PC, HEC, CEC / MECలలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు కేటగిరీల వారీగా అవార్డులు ఇవ్వనున్నారు. నియోజకవర్గ స్థాయిలో, MPC, BiPC, HEC మరియు CEC / MEC ప్రతి గ్రూపులో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయ‌నున్నారు. గత నాలుగేళ్లలో ఒక్క విద్యారంగంలో సంస్కరణల కోసమే ప్రభుత్వం రూ.60,329 కోట్లు ఖర్చు చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12 నుండి 19 వరకు పాఠశాల, నియోజకవర్గం మరియు జిల్లా స్థాయిలలో 2022-23 SSC పరీక్షలలో మొదటి ముగ్గురు ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రభుత్వం సత్కరించింది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు, ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేస్తోంది.
మరోవైపు ఈ రోజు(మంగ‌ళ‌వారం) విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమ ఏర్పాట్లను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ కమిషనర్‌ ఎంవీ శేషగిరిబాబు, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, సబ్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌, ఎమ్మెల్సీ, సీఎం కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురామ్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ఏర్పాట్లను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

  Last Updated: 20 Jun 2023, 08:36 AM IST