బాలికా విద్యను ప్రోత్సహించేలా, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక చర్యలు చేపట్టారు. పేదింటి ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రతిష్ఠాత్మక పథకం కల్యాణమస్తు, షాదీ తోఫాలను ప్రారంభించారు. వాటికి ప్రత్యేక వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ పెళ్లి కానుకను అందుకోవాలంటే అమ్మాయి కనీసం పదో తరగతి చదివి ఉండాలన్న నిబంధనను విధించారు. పాఠశాలల్లో బాలికల శాతాన్ని పెంచేందుకు వీలుగా ఈ నిబంధనను చేర్చారు.
ఈ పథకాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పథకానికి అర్హత సాధించాలంటే వధువుతో పాటు వరుడు కూడాకనీసం పదో తరగతి దాకా చదువుకుని ఉండాలి. అంతేగాకుండా వధువు వయసు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు నిండి ఉండాలన్న షరతునూ విధించారు.
ఇదీ ప్రభుత్వం అందించే సాయం…
– ఎస్సీలకు రూ.1,00,000
– కులాంతర వివాహం చేసుకునే ఎస్సీలకు రూ.1,20,000
– ఎస్టీలకు రూ.1,00,000
– కులాంతర వివాహం చేసుకునే ఎస్టీలకు రూ.1,20,000
– బీసీలకు రూ.50,000
– కులాంతర వివాహం చేసుకునే బీసీలకు రూ.75,000
– మైనారిటీలకు రూ.1,00,000
– దివ్యాంగులకు రూ.1,50,000
– నిర్మాణ కూలీలకు రూ.40,000
గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం పేదింటి ఆడపిల్లలకు ఇచ్చే పెళ్లి కానుకను వైఎస్సార్సీపీ ప్రభుత్వం భారీగా పెంచింది. మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తున్న జగన్ ప్రభుత్వం ఆ దిశగా వేసిన అడుగు ఇది.
వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా పథకాన్ని ప్రారంభించిన సీఎం. పిల్లలు కచ్చితంగా చదువుకునేందుకు, బాల్య వివాహాలు నిరోధించేందుకు ఈ పథకం తోడ్పడుతుందన్న ముఖ్యమంత్రి. ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారులకు కళ్యాణమస్తు, షాదీ తోఫాలను పంపిణీచేస్తామన్న సీఎం. 1/2 pic.twitter.com/NICt2suqDK
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 30, 2022