హిందూ ఓట్ల (Jagan Hindu)సమీకరణ ప్రస్తుతం రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. క్రిస్టియన్ గా ముద్రపడిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(Jagan) హిందూ సానుభూతిపరునిగా కనిపించే ప్రయత్నం మొదలుపెట్టారని విపక్షాల ఆరోపణ. ఆ క్రమంలో యాగాలు, హోమాలను అధికారికంగా నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. విశ్వాసాలు, నమ్మకాలు వ్యక్తిగతమైనవి అయినప్పటికీ ప్రభుత్వ నిధులతో వాటిని తీర్చుకోవడం రాజ్యాంగ విరుద్ధం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో యాగాలు, హోమాలను ప్రభుత్వం నిర్వహించడం గమనార్హం.
యాగాలు, హోమాలు నిర్వహించడానికి కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పాటించాలని సనాతన ధర్మం చెబుతోంది. అందుకు విరుద్ధంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(Jagan Hindu) కాళ్లకు చెప్పులు వేసుకుని యాగ మండపంలోకి ప్రవేశించడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, భార్యాసమేతంగా యాగాలు, హోమాలకు హాజరు కావాలని సనాతనధర్మం చెబుతోంది. కానీ, వైఎస్ భారతి (YS Bharati)పక్కన లేకుండా యాగాలు, హోమాలకు జగన్మోహన్ రెడ్డి గురువారం భూమి పూజ నిర్వహించారు. పైగా చెప్పులు వేసుకుని ఆయన యాగశాలలోకి ఎంట్రీ ఇవ్వడాన్ని హిందూవాదులు తప్పుబడుతున్నారు. చెప్పులు వేసుకుని జగన్మోహన్ రెడ్డి వచ్చే ఫోటోలను సోషల్ మీడియాలో ప్రత్యర్థులు వైరల్ చేస్తున్నారు.
సనాతన ధర్మ పరిరక్షణతోపాటు రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతూ ప్రజలందరూ కల్యాణ సౌభాగ్యాలతో వర్థిల్లాలని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(Jagan Hindu) పాల్గొన్నారు. ఉదయం 5గంటలకు మహామంగళ వాయిద్య హృద్య నాదం, భగవత్ ప్రీతిగా వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర–విష్వక్సేన పూజలు, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అజస్ర దీపారాధన తదితర కార్యక్రమాలు మొదలయ్యాయి. సీఎం జగన్ యజ్ఞ సంకల్పం తీసుకున్న అనంతరం మహాయజ్ఞం ప్రారంభమైంది. గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కపిల గోవుకు హారతి ఇచ్చారు. అనంతరం అఖండ దీపారాధనలో పాల్గొన్నారు.
నాలుగు ఆగమాల నడుమ మే 17వ తేదీ బుధవారం వరకు 6 రోజులపాటు ఈ మహాయజ్ఞం కొనసాగనుండగా వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం ఆగమాలతో ఏర్పాటు చేసిన నాలుగు ప్రధాన యాగశాలల్లో యజ్ఞాలు జరుగుతాయి. ఒక్కొక్క యాగశాలలో 27 కుండాల చొప్పున మొత్తం 108 కుండాలతో రుత్వికులు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తొలి రోజు ఉదయం మినహా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు.. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కొనసాగుతాయి. పవిత్ర సప్తనదీ, త్రి సముద్ర జలాలతో 1008 కలశాలతో విశేష అభిషేకాలు నిర్వహించనున్నట్టు దేవదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.
యజ్ఞ కార్యక్రమాలను భక్తులు వీక్షించేలా ఉమ్మడిగా యాగశాలల చుట్టూ 4 క్యూలైన్లను ఏర్పాటు చేశారు. యజ్ఞ కార్యక్రమాలను వీక్షిస్తూనే ఆ యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసేలా వీటిని తీర్చిదిద్దారు. వాటిలో ఒకటి వీఐపీల కోసం కేటాయించారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ఆధ్వర్యంలో భక్తులకు రోజుకు ఒక ఆలయం చొప్పున ప్రసాదాల పంపిణీ చేపడుతున్నాయి. తొలిరోజు విజయవాడ దుర్గ గుడి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, చక్రపొంగ లి పంపిణీ చేస్తారు. యజ్ఞం తొలిరోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, 13న ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, 14న అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి, 15న శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, 16న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. 17వ తేదీన చివరి రోజు సీఎం జగన్ చేతుల మీదుగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వ రూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర అన్వయంతో మహా పూర్ణాహుతితో యజ్ఞ కార్యక్రమాలు ముగుస్తాయి.
Also Read : Jagan Shocking : ఒకే రోజు జగన్ కు రెండు షాక్ లు
రాజ్యాధికారం(Jagan Hindu) కోసం చేస్తోన్న యాగాలకు ప్రత్యర్థి పార్టీలు చెబుతున్నాయి. కానీ, రాష్ట్ర సర్వతోభివృద్ధి కోసం అంటూ ప్రభుత్వం చెబుతోంది. ఆరు రోజుల పాటు జరిగే ఈ యాగాలు పూర్తిగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి చేస్తున్నవిగా ప్రచారం జరుగుతోంది. అయితే, సతీసమేతంగా హాజరు కావాల్సిన ఆయన (Jagan) ఒక్కడే కనిపించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. క్రిస్టియన్ గా జగన్మోహన్ రెడ్డిని ప్రత్యర్థి పార్టీలు ప్రొజెక్ట్ చేస్తూ చెప్పులు వేసుకుని యాగశాలలోకి ఎంట్రీ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నాయి.
Also Read : Jagan war : పవన్ పొత్తుపై జగన్ `ప్యాకేజీ` వార్