ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)సతీమణి నారా బ్రాహ్మణి (Nara Brahmani) చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. “మా జీవితంలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభమైంది” అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి పంచుకున్న ఫోటోలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఇంటి (Chandrababu New House)నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆమె ఈ భావోద్వేగపూరిత ట్వీట్ చేయడం జరిగింది.
అమరావతిలో చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన
అమరావతి రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా ఇంటిని నిర్మించబోతున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ప్రాంతంలో, E9 రహదారి పక్కనే ఉన్న ఈ స్థలంలో ఈరోజు బుధువారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి ముందు గత ఏడాది డిసెంబర్లో చంద్రబాబు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఓ ఫ్లాట్ను కొనుగోలు చేయగా, తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ స్థలంలో 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జి+1 నిర్మాణం చేపట్టనున్నారు. నిర్మాణ బాధ్యతను ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్కు అప్పగించారు.
Gold Loan Rules: ఇకపై బంగారంపై రుణం సులభంగా లభించదా?
చంద్రబాబు నివాసం నిర్మాణం తాత్కాలిక హైకోర్టు, సచివాలయానికి మధ్యలో ఉండడం వల్ల కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. నలుదిక్కులా రహదారులతో ఆ ప్రాంతం అనుసంధానమవడం, అధికారిక వ్యవహారాల నిర్వహణకు అనుకూలంగా ఉండటంతో ఈ స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నారా బ్రాహ్మణి చేసిన ట్వీట్తో పాటు, చంద్రబాబు కుటుంబ సభ్యుల సమూహంలో జరిగిన భూమిపూజ కార్యక్రమం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒక పునరుద్ధరణకు నాంది పలికిన ఈ ఘట్టం, పార్టీ కార్యకర్తల్లో అభిమానం మరింత పెంచుతోంది.
A day etched in our hearts forever!
We stood beside our beloved @ncbn garu with immense gratitude and hope as he performed Bhumi Puja for our home in Amaravati — the People’s Capital he envisioned and built with unwavering love.
It was a deeply emotional moment to be there as… pic.twitter.com/yeSNyrN1EP
— Brahmani Nara (@brahmaninara) April 9, 2025