Site icon HashtagU Telugu

P4 : చంద్రబాబు కు అండగా దిగ్గజ పారిశ్రామికవేత్తలు

Chandrababu P4 Scheme

Chandrababu P4 Scheme

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) పేదరిక నిర్మూలనకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. “P4” పేరుతో చేపట్టిన ఈ పథకం ద్వారా పారిశ్రామికవేత్తలు ప్రత్యక్షంగా మండలాల వారీగా పేద కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. ప్రభుత్వ ఖర్చు లేకుండా ధనవంతుల సహాయంతో పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు మేఘా కృష్ణారెడ్డి, చలమలశెట్టి అనిల్, సజ్జన్ కుమార్ గోయెంకా మొదలైన వారు ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. ఈ విధానంలో కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యత (CSR) నిధులను ప్రజా సంక్షేమానికి వినియోగించేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

Jay Shah – Lokesh : ‘లోకేష్ – జైషా’ ఆ లెక్కే వేరప్పా

P4 పథకం ప్రత్యేకత ఏమిటంటే.. ఇది నేరుగా నగదు అందించే పథకం కాదు. బదులుగా, పేద కుటుంబాలకు విద్య, ఉపాధి, వృత్తి శిక్షణ, వ్యాపార అవకాశాలను అందించడం ద్వారా వారిని ఆర్థికంగా స్థిరపడేలా చేయడమే లక్ష్యం. ముఖ్యంగా పిల్లల చదువును కొనసాగించేందుకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కార్పొరేట్ సంస్థలు సహాయపడతాయి. ఈ విధానం విజయవంతమైతే ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రాథమికంగా నాలుగు మండలాల్లో అమలు చేస్తున్న ఈ పథకం మంచి ఫలితాలను ఇస్తే, పెద్ద ఎత్తున విస్తరించే అవకాశముంది.

ఈ కార్యక్రమం ద్వారా పేదరికాన్ని తగ్గించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే అవకాశం ఉంది. కార్పొరేట్ సంస్థలు తమ సహాయాన్ని అందించడంతో పాటు, ప్రభుత్వ నిధులపై భారం తగ్గనుంది. ముఖ్యంగా సామాజికంగా వెనుకబడిన కుటుంబాలు స్వయం సమృద్ధి సాధించే అవకాశాన్ని కల్పించే ఈ పథకం ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు దోహదం చేయనుంది. రాబోయే రెండేళ్లలో P4 పథకం ద్వారా లక్ష్యంగా పెట్టుకున్న మార్పులు సాకారం అయితే, ఇది దేశవ్యాప్తంగా ఆదర్శప్రాయమైన సంక్షేమ పథకంగా నిలిచే అవకాశం ఉంది.