We’re now on WhatsApp. Click to Join
Also read : India vs Pakistan: వన్డే ప్రపంచకప్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ గణాంకాలు ఇవే.. అలా జరిగితే టీమిండియా గెలుపు కష్టమే..?!
గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.245 కోట్లతో కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ (టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ )ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో రైతులంతా టమాటా సాగును పెంచారు.తుంగభద్ర జలాలు అందడంతో సాగు గణనీయంగా పెరిగింది. కర్నూలు జిల్లావ్యాప్తంగా 125 హెక్టార్లలో టమాటా సాగు చేపట్టారు. 2 నెలల క్రితం కిలో టమాటా 200 రూపాయల దాకా చేరడంతో.. అదే రేటు కొనసాగొచ్చనే తప్పుడు అంచనాతో మరింత మంది కూడా టమాటా సాగు వైపు చూపు మళ్లించారు. కానీ టమాటా ధరలు డౌన్ కావడంతో అలాంటి రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఇటీవల సీఎం జగన్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా టమాటా ప్రాసెసింగ్ యూనిట్ పై ప్రకటన చేస్తారని రైతులు ఆశగా ఎదురుచూశారు. అది కూడా జరగలేదు. ఈవిధంగా ఏ రకంగా చూసినా జిల్లాలోని టమాటా రైతులకు నిరాశే మిగిలింది.