Site icon HashtagU Telugu

Tirumala : తిరుమ‌ల ఘాట్ రోడ్ల‌ను ప‌రిశీలించ‌నున్న‌ ఢిల్లీ ఐఐటీ నిపుణులు…?

Tirumala Ghat Road

Tirumala Ghat Road

ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు తిరుమ‌ల ఘాట్ రోడ్లు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. ప‌లు చోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. గ‌త కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టం ఇది రెండోవ‌సారి కావ‌డం..గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతోపాటు మట్టి విరిగిపోవడంతో భక్తుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈ ఘాట్ రోడ్ ని ప‌రిశీలించేందుకు ఢిల్లీ ఐఐటీ నుంచి నిపుణుల బృందం తిరుమ‌ల‌కు వ‌చ్చారు. ఈ బృందం ఇక్క‌డ రెండు రోజులు ప‌ర్య‌టించనుంది. ఆయా ప్రాంతాలను పరిశీలించి, కొండచరియలు విరిగిపడకుండా తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేస్తుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చెన్నై ఐఐటీ నిపుణులు బుధవారం నాడు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. ఢిల్లీ ఐటీ నిపుణుల నివేదికను అధ్యయనం చేసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఇతర పనులను ప్రారంభించనుంది.

భారీ వ‌ర్షాల‌కు కొండ‌పై నుంచి మట్టి, బండరాళ్లు విరిగిప‌డ్డాయి..ఇటు కొండ‌పై ఉన్న చెట్టు నేల‌కొరిగి రోడ్లపై కూలిపోవడంతో ఘాట్‌లోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా అలిపిరి సమీపంలోని రెండవ ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆలయానికి వెళ్లే వాహనాలను కొండపై నుంచి తిరిగి వచ్చే వాహనాలు సాధారణంగా ఉపయోగించే రహదారిపైకి మళ్లించారు. అయితే ఆలయానికి వెళ్లే నడకదారిలో ఎలాంటి అంతరాయం కలగలేదు. బుధవారం కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డు పలుచోట్ల కొండచరియలు విరిగిపడిందని అన్నారు. బుధవారం తెల్లవారుజామున 5.40 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో నాలుగు చోట్ల రిటైనర్‌ గోడలు, ఘాట్‌ రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నాయ‌ని… ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయానికి వాహనాన్ని ఆపడంతో పెను ప్రమాదం తప్పింద‌ని.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేద‌న్నారు.వర్షాల కారణంగా దర్శనాన్ని వాయిదా వేసుకున్న భక్తులు ఆరు నెలల్లోపు దర్శనం టిక్కెట్లను ఉపయోగించుకునే అవకాశం ఉందని చైర్మన్ తెలిపారు