Tirumala : తిరుమ‌ల‌లో పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి ద‌ర్శ‌నానికి.. !

వీకెండ్ కావ‌డంతో తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో తిరుమ‌ల‌కు వ‌చ్చారు. శ్రీవారి దర్శనం కోసం...

  • Written By:
  • Publish Date - November 13, 2022 / 10:10 AM IST

వీకెండ్ కావ‌డంతో తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో తిరుమ‌ల‌కు వ‌చ్చారు. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చున్నారు. దర్శనం లేని వారికి దర్శనాలు పూర్తయ్యేందుకు 40 గంటలు, ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. కాగా తిరుమలను 57,104 మంది దర్శించుకోగా, 32,351 మంది భక్తులు తలనీలాలు స‌మ‌ర్పించారు. టీటీడీకి రూ.4.66 కోట్ల ఆదాయం సమకూరింది. తిరుమలలో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. చలి పెరగడంతో క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తమ సొంత వాహనాల్లో తిరుమలకు వెళ్లారు. దీంతో తిరుపతిలోని చెక్ పాయింట్ల వద్ద తనిఖీల కోసం వాహనాలు బారులు తీరాయి. మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం, రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా తిరుపతి వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-నర్సాపూర్ మధ్య రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించారు.