ఆంధ్రప్రదేశ్లోని తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై శనివారం ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా కీసర, చిల్లకల్లు టోల్ప్లాజాల వద్ద అధికారులు రద్దీని తగ్గించేందుకు ప్రయత్నించినప్పటికీ కార్లు, బస్సులు, ఇతర రవాణా వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. సాధారణంగా ఈ టోల్ ప్లాజాలలో ప్రతిరోజూ దాదాపు 38,000 వాహనాలు తిరుగుతాయి. కానీ సంక్రాంతికి వాహనాల సంఖ్య పెరిగింది. సంక్రాంతి సందర్భంగా ఈ టోల్ ప్లాజాల మీదుగా 70 వేల నుంచి లక్ష వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నందిగామ ఫ్లైఓవర్పై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. శుక్రవారం నుంచి అన్ని విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడం వల్ల రద్దీ పెరిగింది. హైదరాబాద్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనులు చేస్తున్న వారంతా సంక్రాంతికి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సొంత వాహనాల్లో బయల్దేరారు.దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ నెలకొంది.
We’re now on WhatsApp. Click to Join.v
రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు, బస్సులు నడుపుతున్నారు. రానున్న రెండు రోజుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్వస్థలాలకు వెళ్లే వారి కోసం 6,795 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ప్రయాణికులు ప్రైవేట్ క్యారియర్లకు బదులుగా ఈ బస్సులను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. హైదరాబాద్తోపాటు ఇతర తెలంగాణ జిల్లాల నుంచి దాదాపు రెండు లక్షల మంది ప్రజలు సంక్రాంతికి ఏపీలోని తమ స్వగ్రామాలకు వస్తారని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ అధికారులు బస్సులను ఏర్పాటు చేశారు.
Also Read: YCP : టీడీపీలోకి బెజవాడ వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవ కుమార్.. వంగవీటి రాధాతో చర్చలు