Site icon HashtagU Telugu

Heavy Rains : రాయలసీమలో దంచి కొడుతున్న భారీ వర్షాలు..స్కూల్స్ కు సెలవు

Rains In Rayalaseema

Rains In Rayalaseema

అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలను (Rayalaseema Districts) భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం, నంద్యాల, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల (Rains ) కారణంగా నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి వాతావరణ కేంద్రం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇదే సమయంలో, తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Tea Strainer: టీ వడపోసే గంటెను సులభంగా శుభ్రం చేసుకోండిలా!

భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈరోజు (నిన్న) సెలవు ప్రకటించినట్లు డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలవు కారణంగా కోల్పోయిన తరగతులను వచ్చే రెండో శనివారం నిర్వహిస్తామని డీఈవో స్పష్టం చేశారు. అలాగే, వర్షాలు తగ్గే వరకు విద్యార్థులు బయటకు వెళ్లకుండా వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా ఈ సెలవు నిబంధనను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. వర్షపు నీరు నిలిచి ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గరకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. అస్వస్థతకు గురైనవారికి తక్షణ వైద్య సహాయం అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ వర్షాకాలంలో అనవసరంగా ప్రయాణాలు చేయకుండా, సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. వర్షాల వల్ల జరిగే నష్టాన్ని తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.