స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అయితే సీఐడీ తరపు న్యాయవాది ఈ కేసులో పాస్ ఓవర్ను కోరడంతో విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అంతేకాకుండా.. ఈ కేసుకు సంబంధించి వివిధ తీర్పులను ప్రస్తావిస్తూ ఈ కేసులో ఏపీ సీఐడీ అదనపు కౌంటర్ను సమర్పించింది. మరోవైపు అసైన్డ్ భూ కుంభకోణం కేసులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని నారాయణ దాఖలు చేసిన పిటిషన్ను కూడా హైకోర్టు విచారించనుంది, అసైన్డ్ భూమి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నారాయణ సహచరుడు కేసును రెండు వారాల పాటు వాయిదా వేసింది. ఆరోగ్య కారణాలతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్నారు. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో కంటికి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్నారు.
Also Read: Revanth Reddy: రేవంత్ వాహనం తనిఖీ, సహకరించిన టీపీసీసీ చీఫ్!