Gunturu TDP Leaders : ఉమ్మ‌డి గుంటూరు జిల్లా నేత‌ల‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబు భేటీ

ఉమ్మ‌డి గుంటూరు జిల్లా టీడీపీ ఇంఛార్జ్‌లు, ముఖ్య నేత‌ల‌తో అధినేత చంద్ర‌బాబు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు....

  • Written By:
  • Publish Date - October 1, 2022 / 07:11 AM IST

ఉమ్మ‌డి గుంటూరు జిల్లా టీడీపీ ఇంఛార్జ్‌లు, ముఖ్య నేత‌ల‌తో అధినేత చంద్ర‌బాబు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు టీడీపీ జిల్లా నాయకులు నిర్వహిస్తున్న కార్యక్రమాలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబు నాయుడు సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. గతంలో గుంటూరు జిల్లాను యూనిట్‌గా చేసుకుని ఈ కార్యక్రమాలను నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేసిన నాయుడు, రానున్న రోజుల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, వైఎస్సార్‌సీపీలోని పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై కూడా నేతలు ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చినట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డి వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఆయన చెప్పింది వింటార‌ని మాజీ ఎమ్ జీ.వీ.ఆంజనేయులు ఆరోపించారు. జగన్ నియత పోకడలకు ముఖాలు కూడా చూపించలేకపోతున్నామ‌ని వైసీపీ నేత‌లు అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకుంటున్నార‌ని ఆయ‌న అన్నారు.\ తాము అధినేత వద్ద ఏదైనా స్వేచ్ఛగా చెప్పే స్వాతంత్య్రం త‌మ‌కుందని.. గుంటూరు జిల్లాలో మంత్రుల అవినీతి, విచ్చలవిడి తనం పై ఐక్యంగా పోరాడతామ‌ని తెలిపారు. గుంటూరు జిల్లా మంత్రులు పనికిరాని సన్నాసులని ఆయ‌న వ్యాఖ్యానించారు.