Site icon HashtagU Telugu

Urinate: ఒంగోలులో మధ్యప్రదేశ్ తరహా దారుణం.. చావబాది, నోట్లో మూత్రం పోసి చిత్రహింసలు

Indian Student Dies In US

Crime Imresizer

Urinate: మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై జరిగిన మూత్ర విసర్జన (Urinate) ఘటన మరువక ముందే ఏపీలోనూ అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒంగోలులో గిరిజన యువకుడిపై పలువురు దుండగులు దాడి చేసి, నోట్లో మూత్ర విసర్జన (Urinate) చేశారు. ఈ పైశాచికత్వాన్ని కొందరు వీడియో తీసి శునకానందం పొందారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ కాగా.. వీడియో ఆధారంగా 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఒంగోలులో నెలరోజుల క్రితం జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాత గొడవల నేపథ్యంలో ఓ వ్యక్తిని చావబాది, నోట్లో మూత్రం పోశారు. తీవ్ర గాయాలతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. అయితే యువకుడ్ని చితకబాది నోట్లో మూత్రం పోసిన వీడియోలు బహిర్గతమయ్యాయి. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో కొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Also Read: PUBG Love Case: పబ్జీ కేసులో బిగ్ ట్విస్ట్, ఆమె పాక్ ఏజెంట్?

చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు నవీన్‌, అంజిల మధ్య చిన్నపాటి గొడవ మనస్పర్దలకు దారి తీసింది. ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఒంగోలు శివారులో వీరిద్దరితో పాటు మరికొంతమంది యువకులు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న అంజి తనతో గతంలో గొడవపెట్టుకున్న నవీన్‌పై గొడవకు దిగాడు. అతనికి మిగతా యువకులు సహకరించారు. నవీన్‌ను విచక్షణా రహితంగా కొట్టారు. బాధితుడిపై మూత్రం పోశారు. నోట్లో మూత్రం పోసి, తాగాలంటూ చావగొట్టారు. అంతే కాకుండా ఈ దారుణాన్ని తమ దగ్గర ఉన్న సెల్‌ఫోన్లో రికార్డు చేశారు.

ఈ ఘటన జరిగిన తరువాత బాధితుడు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నెల రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోను నిందితుల్లోనే కొంతమంది సోషల్‌ మీడియాలో తాజాగా అప్‌లోడ్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఒంగోలు డిఎస్‌పి నారాయణస్వామి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసులో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.