Good News : రైలు ప్రయాణికులకు శుభవార్త

Good News : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ నుంచి హైదరాబాద్ తిరిగొస్తున్న వారికోసం ప్రత్యే్క రైళ్లు (Special Trains) సిద్ధం చేసింది

Published By: HashtagU Telugu Desk
Special Trains

Special Trains

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) ఘనంగా ముగిసాయి. గత ఏడాది కంటే ఏడాది ఎంతో ఘనంగా పండగను జరుపుకున్నారు. వారం రోజుల పాటు సొంత ఊర్లలో ప్రజలు ఎంతో ఉత్సహంగా పండగను జరుపుకొని , ఇప్పుడు మళ్లీ పట్నం బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ నుంచి హైదరాబాద్ తిరిగొస్తున్న వారికోసం ప్రత్యే్క రైళ్లు (Special Trains) సిద్ధం చేసింది. మొత్తం 8 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Champions Trophy Squad: నేడు ఛాంపియ‌న్స్ ట్రోఫీకి జ‌ట్టును ప్ర‌క‌టించ‌నున్న బీసీసీఐ!

జనవరి 18 నుంచి 20 తేదీలలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈరోజు( జనవరి 18న) కాకినాడ నుంచి చర్లపల్లికి ఒక రైలు, విశాఖపట్నం నుంచి 2 ప్రత్యేక రైళ్లు చర్లపల్లికి స్టార్ట్ అవుతాయని తెలిపారు. అదే విధంగా జనవరి 19న విశాఖపట్నం, నరసాపురం నుంచి మరో 2 రైళ్లు చర్లపల్లి బయలుదేరతాయి. అదేరోజు చర్లపల్లి నుంచి భువనేశ్వర్‌కు ఒకటి, విశాఖపట్నానికి ఒకటి చొప్పున 2 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి జనవరి 20వ తేదీన మరో ప్రత్యేక రైలు ఉందని సీపీఆర్వో సీహెచ్‌ శ్రీధర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రత్యేక రైళ్ళను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే సోషల్ మీడియా లో కూడా ఈ ప్రత్యేక రైళ్ల గురించి ప్రచారం చేస్తుంది.

  Last Updated: 18 Jan 2025, 10:30 AM IST