Site icon HashtagU Telugu

Good News : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..తగ్గనున్న కరెంట్ ఛార్జీలు

Current Charges Down In Ap

Current Charges Down In Ap

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విద్యుత్ ఛార్జీల (Electricity Charges) విషయంలో ముఖ్యమైన ఉపశమనం లభించనుంది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి తాజాగా చేసిన ప్రకటన ప్రకారం నవంబర్‌ నెల నుండి గృహ వినియోగదారులపై కరెంట్ ఛార్జీలు తగ్గించనున్నట్లు వెల్లడించారు. యూనిట్‌కు 13 పైసల చొప్పున ఛార్జీలు తగ్గించే నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం, అధిక ఉత్పత్తి వ్యయాల మధ్య కూడా ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు.

Kamenini Vs Balakrishna : రికార్డుల నుంచి కామినేని, బాలకృష్ణ వ్యాఖ్యల తొలగింపు!

గత ప్రభుత్వం ఐదేళ్లలో మొత్తం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిందని మంత్రి రవి విమర్శించారు. అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్లను కట్టడి చేసి, ఆర్థిక వ్యవస్థను నియంత్రించామని ఆయన అన్నారు. కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ విభాగంలో పారదర్శకత, వినియోగదారుల ప్రయోజనం కోసం పలు చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం ప్రజలపై అదనపు ఆర్థికభారం పడకుండా చూడడమే అని మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.926 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించినట్లు తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లలో ఖర్చును తగ్గించి ఇంకా మరిన్ని రాయితీలు ఇవ్వడానికి కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా లక్షలాది గృహ వినియోగదారులకు లాభం కలగనుందని, రాబోయే నెలల్లో విద్యుత్ రంగంలో మరింత సానుకూల మార్పులు కనిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇలాగే సౌకర్యాలను విస్తరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రవి స్పష్టం చేశారు.

Exit mobile version