Summer Special Trains : వేసవి వేళ రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎక్కడ చూసినా ట్రైన్స్ నిండిపోయి కనిపిస్తున్నాయి. అందుకే ట్రైన్లో వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణమధ్య రైల్వే 15 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు మే 1 నుంచి ఆగస్టు 2 వరకు షెడ్యూల్ వారీగా రాకపోకలు సాగిస్తాయి. పాట్నా – సికింద్రాబాద్, హైదరాబాద్ – పాట్నా, దానాపూర్ – సికింద్రాబాద్, దనపూర్ – బెంగుళూరు వంటి స్టేషన్ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్ల వేళలు, రిజర్వేషన్ తదితర వివరాల కోసం దక్షిణ మధ్య రైల్వే వెబ్సైట్ను చూడాలని అధికారులు సూచించారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ సీజన్లో టూర్లకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వారందరికీ ఈ స్పెషల్ ట్రైన్లతో(Summer Special Trains) ఎంతో సౌకర్యం కలుగనుంది.
We’re now on WhatsApp. Click to Join
వేసవి ప్రత్యేక రైళ్ల వివరాలివీ..
- ఎస్ఎంవీ బెంగళూరు – మాల్దా టౌన్ (06563) ప్రత్యేక రైలు ఈ నెల 14 నుంచి మే 5 వరకు ప్రతి ఆదివారం రాత్రి 11.40 గంటలకు బెంగళూరులో బయలుదేరి మర్నాడు సాయంత్రం 6.13 గంటలకు దువ్వాడకు వచ్చి.. 6.15 గంటలకు వెళుతుంది.
- మాల్దా టౌన్-ఎస్ఎంవీ బెంగళూరు (06564) ప్రత్యేక రైలు ఈనెల 17 నుంచి మే 8 వరకు ప్రతి బుధవారం సాయంత్రం 4 గంటలకు మాల్దా టౌన్లో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 3.08 గంటలకు దువ్వాడకు వచ్చి.. 3.10 గంటలకు వెళ్తుంది. ఈ రైలు రేణిగుంట, గూడూరు, ఒంగోలు, విజయవాడ, రాజమహేంద్రవరం, దువ్వాడ, సింహాచలం నార్త్, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్డు, పలాస స్టేషన్లలో ఆగుతుంది.
- ఈనెల 15 నుంచి మే 6 వరకు మైసూర్-ముజఫర్పూర్(06221) రైలు ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటలకు మైసూరులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.18 గంటలకు దువ్వాడకు వచ్చి.. 7.20 గంటలకు వెళుతుంది.
- ముజఫర్పూర్-మైసూర్(06222) రైలు ఈనెల 18 నుంచి మే 9 వరకు ప్రతి గురువారం మధ్యాహ్నం 1 గంటకు ముజఫర్పూర్లో బయలుదేరి మర్నాడు రాత్రి 7.18 గంటలకు దువ్వాడకు వచ్చి.. రాత్రి 7.20 గంటలకు వెళుతుంది. రేణిగుంట, గూడూరు, ఒంగోలు, విజయవాడ, రాజమహేంద్రవరం, దువ్వాడ, సింహాచలం నార్త్, కొత్తవలస జంక్షన్, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస స్టేషన్లలో ఆగుతుంది.