ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభ ఆమోదించింది. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఏపీ పునర్విభజన సవరణ చట్టం బిల్లు పేరుతో బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ అనంతరం, లోక్సభ అమరావతి బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా మరో అడుగు ముందుకు పడింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించింది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం బిల్లు పేరుతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం రెండు గంటల పాటు వివిధ పార్టీల సభ్యులు బిల్లుపై చర్చించారు. ఆ తర్వాత అమరావతి బిల్లును లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బిల్లుకు మద్దతు ఇచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేశారు. గురువారం ఈ బిల్లును కేంద్రం రాజ్యసభ ముందుకు తీసుకురానుంది.
