Ashok Gajapathi Raju: పూసపాటి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) గోవా గవర్నర్గా నియమితులయ్యారు. ఈ నియామకాన్ని రాష్ట్రపతి భవన్ తాజాగా ప్రకటించింది ప్రకటించింది. అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, విజయనగరం రాజవంశీకుడు. మాజీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. ఆయన 1978 నుండి రాజకీయాల్లో ఉన్నారు. విజయనగరం నియోజకవర్గం నుండి 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అశోక్ గజపతిరాజును గవర్నర్గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రకటించారు.
Also Read: Jannik Sinner: వింబుల్డన్ ప్రైజ్ మనీలో సగం కోల్పోనున్న సిన్నర్.. కారణమిదే?
అశోక్ గజపతిరాజుతో పాటు మరో ఇద్దరిన్నీ కూడా గవర్నర్లుగా నియమించారు. హర్యానా గవర్నర్గా బండారు దత్తాత్రేయ స్థానంలో ఆషింకుమార్ ఘోష్ను నియమించగా.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా బి.డి.మిశ్రా స్థానంలో కవీందర్ గుప్తాను నియమించారు. అశోక్ గజపతిరాజు 2014 నుంచి 2018 వరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.
అశోక్ గజపతిరాజు రాజకీయ జీవితం
అశోక్ గజపతిరాజు 1978లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. విజయనగరం నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటినుండి ఆయన ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆయన విజయనగరం నియోజకవర్గం నుండి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన రాజకీయ స్థిరత్వం, స్థానిక ప్రజలతో బలమైన అనుబంధం దీనికి కారణం. అశోక్ గజపతిరాజు ఒకసారి విజయనగరం నుండి లోక్సభ సభ్యుడిగా (ఎంపీ) ఎన్నికయ్యారు. ఇది ఆయన రాజకీయ జీవనంలో మరో ముఖ్యమైన ఘట్టం.
కేంద్ర మంత్రిగా సేవలు (2014-2018)
2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో అశోక్ గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన 2018 వరకు సేవలు అందించారు. ఈ సమయంలో ఆయన విమానయాన రంగంలో అనేక సంస్కరణలకు దోహదపడ్డారు. అశోక్ గజపతిరాజు విజయనగరం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన రాజకీయ వ్యూహాలు, స్థానిక నాయకత్వం టీడీపీకి బలమైన ఆధారం కల్పించాయి.