Site icon HashtagU Telugu

Missing: తిరుపతిలో ఐదుగురు విద్యార్థులు మిస్సింగ్..!

Cropped (5)

Cropped (5)

తిరుపతి నగరంలో ఐదు మంది విద్యార్థుల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతుంది. అన్నమయ్య స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న మోహత, మౌనశ్రీ, గునశ్రీ సహా మరో ఇద్దరు బాలురు మిస్ అయ్యారు. ఉదయం 6 గంటలకు స్టడీ అవర్స్ కోసం వెళ్లిన విద్యార్థులు తిరిగి ఇంటికి రాకపోవడంపై తల్లితండ్రులు ఆందోళన చెందారు. పిల్లల కోసం తలితండ్రులు పలు చోట్ల వెతికారు. పిల్లలు కనిపించకపోవడంతో పిల్లల పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.