Site icon HashtagU Telugu

Andhra Pradesh : ఏపీలో రైతుల్ని ముంచిన రైస్ మిల్ల‌ర్లు.. ధాన్యాన్ని త‌ర‌లించ‌కుండా..?

Farmers - Paddy

Farmers - Paddy

ఏపీలో మిచౌంగ్ తుపాను దృష్ట్యా పొలాల్లో ఉన్న వ‌రి ధాన్యాన్ని రైల్ మిల్లుకు త‌ర‌లించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా రైస్‌మిల్లర్లు మాత్రం ప్రభుత్వానికి, రైతులకు సహకరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భ‌రోసా కేంద్రాల (ఆర్‌బికె) ద్వారా ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను కోరింది. గ్రామంలో రవాణా వాహనాల కొరత ఉంద‌ని.. మిల్లర్లు RBK- సిఫార్సు చేసిన వరి ధాన్యాన్ని అన్‌లోడ్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారు. రైస్ మిల్లర్లు రైతుల నుంచి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే తక్కువ ధరకు నేరుగా వరిని కొనుగోలు చేస్తున్నారు.ఈ నేప‌థ్యంలో ఆ ధాన్యాన్ని మాత్ర‌మే రైస్ మిల్ల‌ర్లు లోడింగ్ చేస్తున్నారు కానీ ఆర్‌బీకే సిఫార్సు చేసిన ధాన్యాన్ని లోడ్ చేయ‌డం లేదు గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో సరైన పర్యవేక్షణ లేక‌పోవ‌డంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. గ్రామ సచివాలయం, ఆర్‌బీకే సిబ్బంది వినతులను రైస్‌మిల్లర్లు పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రత్యేకాధికారులు దృష్టి సారించి రైస్ మిల్లు స్థాయిలో వరి ధాన్యాన్ని త్వరితగతిన త‌ర‌లించేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Also Read:  Cyclone Michaung : రైతుల కంట క‌న్నీళ్లు మిగిల్చిన మిచౌంగ్ తుపాను.. ద‌క్షిణ కోస్తాలో తీవ్రంగా దెబ్బ‌తిన్న పంట‌లు

Exit mobile version