AP Trains : శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడం రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సి.సిగడం సమీపంలో పలాస – విశాఖ ప్యాసింజర్ రైలు కొన్నిగంటల పాటు నిలిచిపోయింది. దీంతో రైలు ప్యాసింజర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు రైల్వే సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపట్టడంతో మళ్లీ రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి.
ఇక విజయవాడ సెక్షన్లో భద్రతాపరమైన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో కొన్ని రైళ్లను రద్దు చేసి, మరికొన్నింటిని దారిమళ్లించారు. ఈనెల 18 నుంచి 24 వరకు కాకినాడ-విశాఖపట్నం-కాకినాడ పాసింజర్ (17267/17268), రాజమండ్రి-విశాఖ-రాజమండ్రి ప్రత్యేక పాసింజర్ (07466/07467), గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్ప్రెస్ (17239), గుంటూరు-రాయగడ (17243), మచిలీపట్నం-విశాఖ (17219) రైళ్లు క్యాన్సల్ అయ్యాయి. ఈనెల 19 నుంచి 25 వరకు విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ (17240), రాయగడ-గుంటూరు (17244), విశాఖ-మచిలీపట్నం (17220) రద్దు చేశారు. అలాగే ఈనెల 18, 19, 20, 22, 23 తేదీల్లో విశాఖ-విజయవాడ-విశాఖ మధ్య నడిచే ఉదయ్ ఎక్స్ప్రెస్ రైళ్ల (22701, 22702 )ను కూడా క్యాన్సల్ చేశారు.