Site icon HashtagU Telugu

Suicide : క‌డ‌ప‌లో దారుణం.. భార్య, ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన కానిస్టేబుల్.. ఆపై..?

Deaths

Deaths

క‌డ‌ప‌లో దారుణం జ‌రిగింది. పోలీసు హెడ్ కానిస్టేబుల్ తన కుటుంబంలోని ముగ్గురిని చంపి, ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న పోలీసు శాఖలో సంచలనం సృష్టించింది. మృతుడు కడప టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు (55)గా గుర్తించారు. హెడ్ కానిస్టేబుల్ రాత్రి 11 గంటల వరకు విధుల్లో ఉన్నాడ‌ని.. ఆ త‌రువాత పిస్టల్ తీసుకొని కోఆపరేటివ్ కాలనీలో ఉన్న అతని ఇంటికి వెళ్ళాడ‌ని డీఎస్పీ ఎండీ ష‌రీఫ్ తెలిపారు.తన ఇద్దరు కుమార్తెలు కాకన్య, 22, అభగ్న16, అతని భార్య మాధవి (46)లను గ‌న్‌తో కాల్చి చంపాడ‌ని తెలిపారు. ఈ సంఘటన తరువాత వెంకటేశ్వర్లు అదే ఆయుధంతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని డీఎస్పీ తెలిపారు. ఘ‌ట‌నాస్థ‌లంలో కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు నుండి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. అందులో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF)తో సహా తనకు అన్ని ప్రయోజనాలను అందించాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)ని అభ్యర్థించారు. అయితే, ఈ విషయంపై ఇంకా విచారణ కొనసాగుతోందని, సూసైడ్ నోట్‌లోని వాదనలను కూడా పరిశీలిస్తామని పోలీసు అధికారి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.