Coal Crisis: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్గా పేరొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రస్తుతం తీవ్ర బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గంగవరం పోర్ట్ లిమిటెడ్ లో వారం రోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మె దీనికి కారణం. ఇది ఇలానే కొనసాగితే శాశ్వత నష్టం వచ్చే అవకాశం ఉందంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join
గంగవరం పోర్టు నుంచి దిగుమతి చేసుకున్న 2.5 లక్షల టన్నుల బొగ్గును తరలించే ప్రయత్నాన్ని సమ్మెలో ఉన్న ఉద్యోగులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. దీంతో స్టీల్ ప్లాంట్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ భట్, జిల్లా అధికారులు వర్కర్లతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వర్కర్ యూనియన్లతో పాటు 30,000 మంది ప్లాంట్ ఉద్యోగుల జీవనోపాధి గురించి వారికి వివరించారు. సమ్మెను విరమించాలని కోరారు. నిజానికి గంగవరం పోర్ట్ పై కూడా సమ్మె ప్రభావం చూపిస్తుంది. సుమారు 1,50,000 టన్నుల నిత్యావసర వస్తువులను తరలించే రెండు నౌకలు నిలిచిపోయాయి. ఇది భారీ నష్టాన్ని మిగిల్చింది. దీంతో గంగవరం ఓడరేవులో కార్యకలాపాలు వేగవంతం చేయాలని, ఇప్పటికే స్టాక్లో ఉన్న 2.2 లక్షల టన్నుల బొగ్గును తరలించేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.
Also Read: Ramulu Naik : ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ మరో భారీ షాక్..మాజీ ఎమ్మెల్యే రాజీనామా