Site icon HashtagU Telugu

CM Jagan: 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు మనవే: సీఎం జగన్

CM Jagan

CM Jagan

CM Jagan: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అయితే లోకసభ, అసెంబ్లీ కలిపి మొత్తం 200 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుధవారం జరిగిన “మేమంత సిద్ధం” బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అంతటా వైఎస్సార్సీపీకి ప్రజాభిమానం వెల్లువెత్తుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీకి 200కి 200 సీట్లు ఇచ్చేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారా? అని వేలాది మంది ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు అందుకున్నాడు.

రాబోయే ‘కురుక్షేత్ర’ ఎన్నికల పోరు కేవలం శాసనసభ్యులను ఎన్నుకోవడమే కాదు, సంక్షేమ పథకాల కొనసాగింపు కోసమేనని, జగన్‌కు ఓటేస్తే ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేయడం అంటే ముగింపు పలకడమేనని అన్నారు. పేదలను నిర్లక్ష్యం చేసిన కూటమి పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటూ సీఎం జగన్ సభకి తరలి వచ్చిన వేలాది మంది ప్రజల్ని అడిగారు. అందుకు సిద్దమే అంటూ వైసీపీ మద్దతుదారులు హోరెత్తించారు.

ఇంటి వద్దకే ప్రభుత్వం పథకాలు, నాణ్యమైన విద్యతో సహా ప్రభుత్వం సాధించిన విజయాలను జగన్ మోహన్ రెడ్డి హైలైట్ చేశారు. ప్రస్తుతం 15,002 గ్రామ, వార్డు సచివాలయాలు స్థానిక సేవలను అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికీ వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో లబ్దిపొందితేనే ఓట్లు వేయాలంటూ సీఎం జగన్ మరోసారి ఉద్ఘాటించారు. వైఎస్సార్‌సీపీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చిందని, ప్రతిపక్ష పార్టీలు కక్షసాధింపులకు పాల్పడుతూ పొత్తులు పెట్టుకున్నాయని మండిపడ్డారు. ఎన్నికలకు కేవలం 18 రోజుల సమయం ఉంది, మేము ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాము. చంద్రబాబు మరియు అతని మిత్రపక్షాలు ఒక్క మంచి పని కూడా చేయకపోగా వారంతా కలిసి నాపై బురద చల్లుతున్నారని పేర్కొన్నారు జగన్. బాబు లాంటి మోసగాడు కావాలా, జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా అని అడిగారు సీఎం. చంద్రబాబు పేరు వినగానే ఒక్క సానుకూల విజయాన్ని ఊహించగలరా.. 2014లో రైతు రుణమాఫీ, బీసీ సబ్‌ ప్లాన్‌కు రూ. 10 వేల కోట్లు, ఇంటింటికీ ఉద్యోగాలంటూ ఎన్నో బూటకపు వాగ్దానాలు చేసి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు సీఎం జగన్.

We’re now on WhatsAppClick to Join

ఇదిలా ఉండగా మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 22 రోజుల్లో 86 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2100 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇడుపులపాయలో తన యాత్రను ప్రారంభించి 16 బహిరంగ సభలకు మరియు వృద్ధాప్య పింఛనుదారులు, నేత సంఘాలు, వాహన మిత్ర లబ్ధిదారులు మరియు సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశాలకు హాజరయ్యారు. తొమ్మిది చోట్ల భారీ రోడ్ షోలలో కూడా పాల్గొన్నారు.

Also Read: Teenmar Mallanna : కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న