YSRCP Social Media Meet: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీఎం జగన్ తన ఎన్నికల వ్యూహాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా వైఎస్ జగన్ తాజాగా సోషల్ మీడియా కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ కీలక భేటీలో సీఎం జగన తన సోషల్ మీడియా సైన్యానికి కీలక సూచనలిచ్చారు. ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేసినట్టు సంబంధిత వర్గాల సమాచారం. అయితే ఈ భేటీకి హాజరైన మరికొందరు సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్ర మనస్థాపం చెందుతున్నారు. స్థానికంగా కష్టపడిన వారికీ ప్రాధాన్యత ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందు సోషల్ మీడియా కార్యకర్తలతో జరిగిన భేటీ పార్టీకి కాస్త చెడ్డపేరు వచినట్టుగానే తెలుస్తుంది. పార్టీకి చెందిన పలువురు సోషల్ మీడియా కార్యకర్తలు తమకు ఆహ్వానం రాలేదని, పార్టీ కోసం పనిచేయకుండానే సంబంధాలున్న వారికి ఆహ్వానాలు అందాయని వాపోయారు. వీరిలో కొందరికి విమాన టిక్కెట్లు ఇప్పించి వైజాగ్లోని పెద్ద పెద్ద హోటళ్లలో బస ఏర్పాటు చేసినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందిన సోషల్మీడియాలో కూడా సభ ముగిసిన తర్వాత వారికి ఖరీదైన బహుమతులు ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో పార్టీ కోసం పనిచేసిన వారు తీవ్ర నిరాశకు లోనయ్యారని,
We’re now on WhatsApp. Click to Join
కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు బాహాటంగానే సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. ఆహ్వానాలు పొందిన వారు సోషల్ మీడియాలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు, ఇది అందని వారికి బాధ కలిగించింది. అలాగే జగన్తో మాట్లాడేందుకు ఆహ్వానించినా అనుమతించని వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కార్యకర్తలను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ సమావేశానికి ఎంపిక చేయడంలో ఐ-పీఏసీ కూడా కీలక పాత్ర పోషించిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలను పట్టించుకోకుండా.. వచ్చే మూడు వారాల్లో ఉపయోగపడే ప్రభావశీలులపై దృష్టి సారించారు. ఎన్నికలకు మూడు వారాలు కూడా లేకపోవడంతో సోషల్ మీడియా ఆర్మీ జగన్ మరియు ఇతర సభ్యులపై కాస్త అసహనంగా ఉండటం పార్టీకి చెడ్డపేరు అనే చెప్పాలి.
Also Read: PM Modi : ఖరారైన ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలు..