Jagan Publicity : సీఎం జగన్ పబ్లిసిటీ చేసుకోరట..రోజమ్మ కాస్త అనే ముందు చూసుకోమ్మా..

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 11:00 PM IST

సీఎం జగన్ (CM Jagan) కు అసలు పబ్లిసిటీ (Publicity ) అనేది నచ్చదు..ఎవరికీ ఫోన్లు చేసి తనను పొగడమని చెప్పారు..చేసిన పనులు , అభివృద్ధి , ప్రజలకు సేవ చేయాలి..అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాలి..ఇలా ప్రతి నిత్యం..ప్రజల కోసమే..ప్రజల ఆలోచనల గురించే తప్ప మరోటి ఉండదట..ఇదంతా ఎవరు చెప్పారో తెలుసా..? రాష్ట్ర మంత్రి , వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా (Minister Roja) చెప్పిన మాటలు. ఈ మాటలు విన్న వారు..చదివిన వారంతా..వామ్మో ఏంటి ఇది..కాస్త చూసుకోమ్మా అనే ముందు..అంటూ జగన్ పబ్లిసిటీ స్టంట్లు షేర్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అసలు రాజకీయాల్లో రాణించాలంటే మొదటగా పబ్లిసిటీనే ఉండాలి..అది జగన్ కైనా మరొకరికైనా..ఈరోజుల్లో పబ్లిసిటీ లేనిది ఎవరి గురించి మాట్లాడుకోరు..పట్టించుకోరు..ముఖ్యంగా రాజకీయనేతల గురించి. రాజకీయ నేతలు ఎంత పబ్లిసిటీ చేస్తే అంత బాగా జనాల్లో ఉంటారు..అందుకే ఆనాటి నుండి నేటి వరకు వారు చేసే ప్రతి పని ,ప్రతి కార్యక్రమం ఇలా ప్రతిదీ పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. పేపర్లు , న్యూస్ చానెల్స్ , హోర్డింగ్స్ , ఇలా ఏది వదిలిపెట్టారు..ప్రస్తుతం సోషల్ మీడియా హావ నడుస్తుండడం తో ఎవరికీ వారు సొంతంగా యూట్యూబ్ చానెల్స్ పెట్టుకొని ప్రమోషన్ చేసుకుంటున్నారు.

అలాంటిది సీఎం జగన్ సైతం ఇలాంటి పబ్లిసిటీ లో తక్కువేం కాదు..చేసేది గోరంత..చెప్పేది కొండత..ప్రస్తుతం ఎన్నికల సమయం నడుస్తుండడం తో ప్రతిరోజు పబ్లిసిటీ కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తున్నారు. ఇది కొత్తగా మీము చెపుతుంది కాదు..జనాలు చూస్తున్నదే. ఇలాంటి సమయంలో రోజమ్మ..జగన్ కు పబ్లిసిటీ అంటేనే తెలియదు అన్నట్లు మాట్లాడేసరికి అంత నవ్వుకుంటున్నారు. ఇంకోసారి అనేది ముందు కాస్త చూసుకొని మాట్లాడు అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు.

Read Also : Telangana: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సీఎం రేవంత్ ని కలిసిన పట్నం ఫ్యామిలీ