CM Chandrababu : సింగపూర్ టువాస్ పోర్టును సందర్శించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఆసియాలోనే ప్రముఖమైన టువాస్ పోర్టును సందర్శించారు.

Published By: HashtagU Telugu Desk
Cm Chandra Babu

Cm Chandra Babu

CM Chandrababu : సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఆసియాలోనే ప్రముఖమైన టువాస్ పోర్టును సందర్శించారు. ఈ సందర్శనలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, మగంటి నారాయణ, గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ భరత్ , ఏపీ ప్రభుత్వ అధికారులు ఉన్నారు.

సింగపూర్ పోర్ట్ అథార్టీ రీజనల్ సీఈఓ విన్సెంట్‌తో సీఎం చంద్రబాబు సమావేశమై టువాస్ పోర్టు నిర్మాణం, దాని ప్రత్యేకతలపై చర్చించారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద కంటైనర్ టెర్మినల్‌గా టువాస్ పోర్టును ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు వివరించారు. పోర్టులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఆటోమేషన్ వ్యవస్థను ప్రత్యక్షంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు, ఈ సాంకేతికత వలన లాజిస్టిక్స్ రంగంలో కలిగే మార్పులపై ఆసక్తి కనబరిచారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పోర్టులను నిర్మించాలనే ప్రణాళికల దృష్ట్యా టువాస్ పోర్టు మోడల్‌ను అధ్యయనం చేయడం ముఖ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం పోర్టులు, ఎయిర్‌పోర్టులు , పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధితో రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చాలని సంకల్పించిందని తెలిపారు. కార్గో హ్యాండ్లింగ్, ఆపరేషన్స్ వంటి అంశాల్లో ఆటోమేషన్, ఏఐ వినియోగంపై ఏపీ అధికారులు టువాస్ పోర్టు పద్ధతులను విశ్లేషించారు.

పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధి, ఆపరేషన్ల సౌకర్యాలపై టువాస్ పోర్టు అధికారులు ఇచ్చిన వివరణను ముఖ్యమంత్రి బృందం సమగ్రముగా అధ్యయనం చేసింది. ఏపీ పోర్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు సింగపూర్ భాగస్వామ్యాన్ని పొందే అవకాశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా, ఆపరేషన్ల వేగం, సురక్షత , సామర్థ్యాన్ని పెంచే మార్గాలను కనుగొనడంలో ఈ సందర్శన కీలకమని అధికారులు తెలిపారు.

Shocking : గబ్బిలాలతో చిల్లి చికెన్.. తమిళనాడులో కలకలం

  Last Updated: 28 Jul 2025, 03:51 PM IST