CM Chandrababu : ఏపీలో 26 జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమించిన సీఎం చంద్రబాబు
Latha Suma
CM Chandrababu has appointed in-charge ministers for 26 districts in AP
AP Districts In charge Ministers : ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం…అధికారిక ప్రకటన చేసింది. పలువురు మంత్రులను రెండేసి జిల్లాలకు ఇన్ఛార్జీగా నియమించింది ఏపీ ప్రభుత్వం. అచ్చెన్నాయుడుకు మన్యం, కోనసీమ జిల్లాల ఇన్ఛార్జీ బాధ్యతల అప్పగించారు.
నిమ్మలకు తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గొట్టిపాటి రవికి పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అనగానికి సత్యసాయి, తిరుపతి జిల్లాల బాధ్యతల అప్పగించింది చంద్రబాబు ప్రభుత్వం. పవన్ కళ్యాణ్, లోకేష్ లకు ఇన్ఛార్జీ బాధ్యతలు ఇవ్వకపోడంతో నలుగురు మంత్రులకు రెండేసి జిల్లాల బాధ్యతల అప్పగించారు. జనసేన మంత్రులకు ఏలూరు, గుంటూరు జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. బీజేపీ మంత్రికి ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలను అప్పగించారు.
అతేకాకుండా ఆయా జిల్లాల నేతల మధ్య గ్యాప్ను తగ్గించే బాధ్యతను కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారు. ప్రజలకు ప్రభుత్వానికి కళ్లు, చెవులు మాదిరిగా ఉంటూ కార్యక్రమాలు విజయవంతం చేయడమే వీరి లక్షం. ఈ మేరకు 26 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులు..
.శ్రీకాకుళం జిల్లా – కొండపల్లి శ్రీనివాస్ .అల్లూరి సీతారామరాజు జిల్లా – గుమ్మడి సంధ్యారాణి .పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు – అచ్చెన్నాయుడు .విజయనగరం జిల్లా – వంగలపూడి అనిత .విశాఖపట్నం జిల్లా – డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి .అనకాపల్లి జిల్లా- కొల్లు రవీంద్ర .కాకినాడ జిల్లా – పొంగూరు నారాయణ .తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు – నిమ్మల రామానాయుడు .పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలు – గొట్టిపాటి రవికుమార్ .ఏలూరు జిల్లా – నాదెండ్ల మనోహర్ .కృష్ణా జిల్లా – వాసంశెట్టి సుభాష్ .ఎన్టీఆర్ జిల్లా – సత్యకుమార్ యాదవ్ .ప్రకాశం జిల్లా – ఆనం రామనారాయణరెడ్డి .తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాలు – అనగాని సత్యప్రసాద్ .చిత్తూరు జిల్లా – మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి .గుంటూరు జిల్లా – కందుల దుర్గేష .బాపట్ల జిల్లా – కొలుసు పార్థసారథి .నెల్లూరు జిల్లా – ఎన్ఎండీ ఫరూఖ్ .కడప జిల్లా – సవిత .అన్నమయ్య జిల్లా – బీసీ జనార్థర్ రెడ్డి .నంద్యాల జిల్లా – పయ్యావుల కేశవ్ .అనంతపురం జిల్లా – టీజీ భరత్