Mahanadu : తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’వేదికగా చేసిన సందేశంలో, తెలుగుదేశం మహా పండుగ ‘మహానాడు’ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు శుభాకాంక్షలు. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతం. ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి. తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం పవిత్ర కర్తవ్యం. ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది మన సంకల్పం. అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నాం. తెలుగుదేశం పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే నిలిచింది. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుపుకుంటున్న మహానాడును తొలిసారి కడపలో నిర్వహించ తలపెట్టాం. మహానాడు సందర్భంగా ప్రజా సేవకు పునరంకితమవుతూ ‘యువగళం’కు ప్రాధాన్యతనివ్వాలని, ‘అన్నదాతకు అండగా’ నిలవాలని, ‘స్త్రీ శక్తి’కి పెద్దపీట వేయాలని, ‘పేదల సేవలో’ నిరంతరం శ్రమించాలని, ‘తెలుగు జాతి విశ్వఖ్యాతి’ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని, ‘కార్యకర్తే అధినేత’గా మారాలనే నూతన మార్గదర్శకాలతో…. ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలి…. అదే నా ఆశ… ఆకాంక్ష అని అన్నారు.
#Mahanadu2025Begins
తెలుగుదేశం మహా పండుగ ‘మహానాడు’ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు శుభాకాంక్షలు. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతం. ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి. తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం పవిత్ర కర్తవ్యం. ప్రపంచ… pic.twitter.com/74Jr0TnEuS— N Chandrababu Naidu (@ncbn) May 27, 2025
గత ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన మద్దతు తెలిపారని, అది చరిత్రలో మరచిపోలేని ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. “పునఃప్రారంభమైన పాలనలో ఇదే తొలి మహానాడు. కడప జిల్లాలో జరుగుతున్న ఈ మహాసభలో ప్రజాసేవకు మళ్ళీ అంకితమవుదాం,” అని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు తన సందేశంలో పార్టీ భవిష్యత్ లక్ష్యాలను స్పష్టంగా వెలిబుచ్చారు. “ఈ మహానాడు ద్వారా ‘యువగళం’కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. అన్నదాతకు బలంగా నిలవాలి. మహిళా శక్తిని సమర్థంగా వినియోగించాలి. పేదల సేవలో ప్రతీ నాయకుడు శ్రమించాలి. తెలుగువారి ప్రతిష్టను అంతర్జాతీయంగా నిలబెట్టే విధంగా కార్యాచరణ ఉండాలి,” అని తెలిపారు.
అంతేకాక, “ప్రతి కార్యకర్త నాయకుడిగా ఎదగాలన్నదే మా కొత్త మార్గదర్శకం. ఇది కేవలం ఓ సభ కాదు, నూతన ఉత్సాహానికి నాంది. ఈ ఉత్సాహంతో, ఒక తరం కలల సాకారం వైపు ప్రయాణించాలి,” అని చంద్రబాబు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇదే సందేశాన్ని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానులకు చేరవేశారు. మహానాడు వేదికగా పార్టీ భవిష్యత్తు దిశగా దృఢ సంకల్పంతో ముందుకు సాగేందుకు ప్రజల మద్దతు కోరారు.
Read Also: Vijayasai Reddy Vs Jagan: అవసరమైతే నారా లోకేశ్, చంద్రబాబులను కలుస్తా.. విజయసాయిరెడ్డి ట్వీట్