Free Sand Scheme: జూలై 8 నుంచి ఉచిత ఇసుక పథకం:: చంద్రబాబు

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల క్రితం అమలు చేసిన ఉచిత ఇసుక పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు . జులై 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు

Free Sand Scheme: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల క్రితం అమలు చేసిన ఉచిత ఇసుక పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు . జులై 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. పథకం అమలు సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రను సీఎం నాయుడు ఆదేశించారు. పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కలెక్టర్లు చైర్మన్లుగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి ఖర్చు లేకుండా అవసరమైన నిర్మాణ సామగ్రిని అందించడం కోసం ఉచిత ఇసుక పథకం ప్రవేశ పెట్టడం జరుగుతుంది . ఈ పథకాన్ని కొనసాగించాలనే నిర్ణయం ద్వారా భావన నిర్మాణ కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయం ద్వారా పౌరులకు మద్దతు ఇవ్వడం మరియు రాష్ట్రంలో అభివృద్ధిని ప్రోత్సహించడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

Also Read: Nani Srikanth Odela : నాని దసరా కాంబో షాక్ అయ్యే బడ్జెట్..!