TDP : అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపిన చంద్రబాబు.. కుప్పంలో నిరసన శిబిరానికి వెళ్లి సంఘీభావం

అంగన్వాడీలు చేసే న్యాయబద్ధమైన పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

  • Written By:
  • Publish Date - December 30, 2023 / 04:56 PM IST

అంగన్వాడీలు చేసే న్యాయబద్ధమైన పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం 20 రోజులుగా అంగన్ వాడీ వర్కర్లు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగిన అంగన్వాడీలకు చంద్రబాబు నాయుడు కుప్పంలో శనివారం సంఘీభావం తెలిపారు. టీడీపీ హయంలో రెండుసార్లు వేతనాలు పెంచామ‌ని.. నేడు అంగ‌న్‌వాడీల పట్ల ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని తెలిపారు. సమస్యలపై ఆందోళనలకు దిగితే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. ఈ ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తాన‌ని చంద్ర‌బాబు హ‌మీ ఇచ్చారు. అంగన్వాడీల సమస్యలు మ్యానిఫెస్టోలో పెట్టి పరిష్కరిస్తామ‌న్నారు. అంగ‌న్‌వాడీలు ఐక్యంగా ఉంటే ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని.. షో కాజ్ నోటీసులు ఇచ్చిన అవి తాత్కాలికం మాత్రమేన‌ని తెలిపారు. ఉద్యోగాల నుంచి ఇప్పుడు మిమ్మల్ని అధికారులు తీసేస్తే టీడీపీ వచ్చాక మళ్ళీ నియమిస్తాన‌ని చంద్ర‌బాబు హ‌మీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు అందరికీ ఉందని.. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయనన్నారు. తాను 14 ఏళ్లు సీఎంగా చేసిన అనుభవం ఉంద‌ని.. కానీ ఆందోళనలు చేసేవారిని నేను ఎప్పుడూ ఎవరిని బెదిరించలేదన్నారు.

Also Read:  MLC Kavitha: 22 ల్యాండ్ క్రూజర్‌ కార్ల కొనుగోలులో కేసీఆర్ కు సంబంధం లేదు: ఎమ్మెల్సీ కవిత