Chandrababu Protest: కుప్పంలో రోడ్డుపై చంద్ర‌బాబు బైఠాయింపు, హై టెన్ష‌న్

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు వైసీపీ దాష్టీకాన్ని నిర‌సిస్తూ రోడ్డు మీద భైటాయించారు. బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన ప్లేస్ వ‌ద్ద చంద్ర‌బాబు నిర‌స‌న‌కు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  • Written By:
  • Publish Date - August 25, 2022 / 12:32 PM IST

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు వైసీపీ దాష్టీకాన్ని నిర‌సిస్తూ రోడ్డు మీద భైటాయించారు. బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన ప్లేస్ వ‌ద్ద చంద్ర‌బాబు నిర‌స‌న‌కు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్తలంతా కుప్పంకు చేరుకోవాలని రెండు పార్టీలు వాట్సాప్ ద్వారా సందేశాలను పంపుతున్నాయి. పరిస్థితిని జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు
కుప్పంలో టీడీపీ నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ వద్దకు వెళ్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాళ్లు వేసేందుకు వైసీపీ శ్రేణులు ప్ర‌య‌త్నం చేశారు. బ‌స్టాండ్ వ‌ద్ద ఉన్న అన్న క్యాంటీన్ పై వైసీపీ దాడులను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు నాయుడు ధ‌ర్నాకు దిగ‌డంతో హై టెన్ష‌న్ నెల‌కొంది.

మూడు రోజులు కుప్పం ప‌ర్య‌ట‌న కోసం వెళ్లిన టీడీపీ అధినేత పర్యటన ఆద్యంత‌మూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. కుప్పం బంద్ కు వైసీపీ పిలుపునివ్వడంతో… వ్యాపారులు దుకాణాలను మూసేశారు. ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పలు చోట్ల బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.