Chandrababu : మెడికల్ కాలేజిల‌పై జ‌గ‌న్ చెప్పేవి ప‌చ్చి అబ‌ద్ధాలు: చంద్ర‌బాబు

1986లో హెల్త్ యూనివర్శిటీని ఎన్టీఆర్ స్థాపించారని చంద్ర‌బాబు అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకొక మెడికల్ కాలేజీని తీసుకొచ్చానని తెలిపారు.

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 03:26 PM IST

1986లో హెల్త్ యూనివర్శిటీని ఎన్టీఆర్ స్థాపించారని చంద్ర‌బాబు అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకొక మెడికల్ కాలేజీని తీసుకొచ్చానని తెలిపారు. జగన్ మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలేనని అన్నారు. హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ చీకటి జీవోను తీసుకొచ్చారని విమ‌ర్శించారు. జగన్ వచ్చిన తర్వాతే ఆరోగ్య రంగం భ్రష్టుపట్టిందని ఆగ్ర‌హించారు. జగన్ సీఎం అయిన తర్వాత మూడు మెడికల్ కాలేజీలకు గుర్తింపు మాత్రమే వచ్చిందని గుర్తు చేశారు. రాత్రి వాళ్ల నాన్న ఆత్మతో మాట్లాడి యూనివర్శిటీ పేరును మార్చారా? అని ప్రశ్నించారు. వైయస్సార్, జగన్ ఇద్దరూ కలిసి ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చారో చెప్పాలని అన్నారు. ఎన్టీఆర్ కంటే వైయస్సార్ ఎలా గొప్ప వ్యక్తి అని ప్రశ్నించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు గవర్నర్ ను కలిశారు. ఎన్టీఆర్ పేరును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. ప‌రిశీలిస్తాన‌ని గ‌వ‌ర్న‌ర్ హామీ ఇచ్చిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు.

డాక్ట‌ర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ బిల్లు ఏపీ అసెంబ్లీలో ఆమోదించిన విష‌యం గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ కు తెలియ‌దని చెప్పార‌ని టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు అన్నారు. పేరు మార్పును నిరసిస్తూ గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన త‌రువాత మీడియాతో చంద్ర‌బాబు మాట్లాడారు. వైఎస్ ఛాన్స్ ల‌ర్ గా యూనివ‌ర్సిటీకి గ‌వ‌ర్న‌ర్ ఉంటారు. కానీ, ఆయ‌న‌కు కూడా తెలియ‌కుండా ఎన్టీఆర్ పేరును మార్చేసి, వైఎస్ఆర్ పేరు పెట్ట‌డం దారుణ‌మ‌న్నారు చంద్ర‌బాబు.