టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కొత్త పంథాలో(CBN Selfy War) ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఆధునిక యుగానికి తగిన విధంగా ఆయన సెల్ఫీ తో సీఎం జగన్మోహన్ రెడ్డిని(Jagan mohan Reddy) టార్గెట్ చేశారు. ప్రాంతీయ మీటింగ్ లు పెడుతున్న ఆయన నెల్లూరు జిల్లాలోని టిడ్కో ఇళ్ల మీద దృష్టి పెట్టారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు నిర్మించిన ఇళ్ల వద్ద సెల్ఫీ తీసుకున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. ఇదే తరహా ఛాలెంజ్ లను యువగళం పర్యటనలో ఉన్న లోకేష్ చేస్తున్నారు.
నెల్లూరులో టీడీపీ జోన్-4 సమావేశం చంద్రబాబు నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో ఈ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు గతంలో తాము నిర్మించిన వేలాది టిడ్కో ఇళ్లను సందర్శించారు. టిడ్కో ఇళ్ల వద్ద నిల్చుని మొబైల్ ఫోన్ తో సెల్ఫీ(CBN Sefy War) దిగారు. ఆ క్రమంలో సీఎం జగన్ కు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. “చూడు….జగన్! ఇవే మా ప్రభుత్వ హాయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు” అంటూ ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో అప్పట్లో నిర్మించిన లక్షల ఇళ్లకు సజీవ సాక్ష్యాలు అంటూ స్పష్టం చేశారు. నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? అసలు, నువ్వు కట్టిన ఇళ్లెక్కడ… జవాబు చెప్పగలవా? అంటూ జగన్ ను ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోను చంద్రబాబు పంచుకున్నారు. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని(CBN Selfy War) ఇప్పటికే టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రలోనూ సెల్ఫీ చాలెంజ్ లు చేస్తున్నారు. మిగిలిన లీడర్లు కూడా ఇదే తరహా ఛాలెంజ్ లను నియోజకవర్గ స్థాయిలో చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు నివ్వడం జరిగింది.
`గంజాయి వద్దు బ్రో` అంటూ మరో స్లోగన్ ను టీడీపీ తాజాగా తయారు చేసింది. ఆ కొటేషన్ ను సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తోంది. నాలుగేళ్లుగా గంజాయి, డ్రగ్స్ తో ఏపీ యువతను మత్తులోకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దించిందని టీడీపీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. గుజరాత్ పోర్ట్ నుంచి కాకినాడ ఓడరేవుకు డ్రగ్స్ సరఫరా అవుతోందని అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ఆధారాలను బయట పెట్టింది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్, గంజాయి సరఫరాలో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించింది. ఇప్పుడు `గంజాయి వద్ద బ్రో` అంటూ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి (Jagan mohan Reddy)మీద వార్ ను ప్రకటించింది.
Also Read : PK-Jagan-CBN : BJP కర్ణాటక గేమ్,APఅగ్ర నేతలపై ఢిల్లీ రైడ్!
మొత్తం మీద ప్రస్తుత తరానికి కనెక్ట్ అయ్యేలా చంద్రబాబు, లోకేష్ సెల్ఫీలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా జగన్మోహన్ రెడ్డి (Jagan mohan Reddy) ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించింది. గత మూడేళ్లుగా జూమ్ ద్వారా మీటింగ్ లు పెట్టిన చంద్రబాబు సాంకేతికంగా ముందున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియాను మరింత దూకుడుగా తీసుకెళుతున్నారు. రైస్ బకెట్, గ్రీన్ ఛాలెంజ్ తరహాలో ఇప్పుడు టిడ్కో ఇళ్ల ఛాలెంజ్ ను చంద్రబాబు విసిరారు. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ ఎమ్మెల్యేలను టాగ్ చేస్తూ ఇదే తరహా ఛాలెంజ్ లను ఆయా ప్రాంతాల్లోని సమస్యల ఆధారంగా చేయాలని చంద్రబాబు కోరారు.
Also Read : Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047, ఆవిర్భావ సభలో తెలుగుజాతికి దిశానిర్దేశం