Botsa Satyanarayana : పవన్ అపాయింట్ మెంట్ కోరిన బొత్స..కారణం అదేనా ?

Botsa Satyanarayana : మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స, పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది

Published By: HashtagU Telugu Desk
Botsa Pawan

Botsa Pawan

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స, పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ అపాయింట్‌మెంట్ తన కోసం కాదని, కొల్లేరు ప్రాంత రైతుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు అని వెల్లడించారు. కొల్లేరు ప్రాంతంలో అటవీశాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతులు తమ సమస్యల్ని చెప్పేందుకు పవన్‌ను కలవాలని బొత్స కోరారు.

కొల్లేరు హద్దుల్లో అక్రమ ఆక్రమణలపై సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో అటవీశాఖ సర్వే ప్రారంభమైంది. ఈ నెల 9వ తేదీ నుంచి కొనసాగుతున్న సర్వే రైతుల్లో ఆందోళనకు కారణమైంది. అందుకే పవన్ కల్యాణ్ రాగానే రైతులను కలవాలని బొత్స సూచించారు. ఢిల్లీ ప్రయాణం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాను రైతులను కలుస్తానని పవన్ హామీ ఇచ్చారు. బొత్స పవన్‌ను స్వయంగా కలిసి దీనిపై చర్చించడం, ఆయన మద్దతు కోరడం రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామంగా మారింది.

పవన్ కల్యాణ్ రైతుల సమస్యలను పరిశీలించి వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదివరకు కూడా పవన్ రైతు సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పిన నేపథ్యంలో కొల్లేరు రైతుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ స్థాయిలో చర్చకు రావడం కీలకంగా మారింది. సుప్రీంకోర్టులో రేపు విచారణ ఉన్న నేపథ్యంలో ఈ సమస్యపై ప్రభుత్వం ఏవిధమైన నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

  Last Updated: 18 Mar 2025, 10:52 PM IST