Site icon HashtagU Telugu

Whats Today : గద్వాల, నల్గొండ, వరంగల్ సభలకు అమిత్‌షా.. విజయశాంతి ప్రెస్‌మీట్

Whats Today

Whats Today

Whats Today : ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఒకే రోజు మూడు భారీ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం తొలుత గద్వాలకు అమిత్ షా చేరుకోనున్నారు. అక్కడ తలపెట్టిన సకల జనుల విజయ సంకల్ప సభకు హాజరవుతారు. అనంతరం నల్గొండకు వెళ్తారు. అక్కడ పార్టీ నిర్వహించనున్న సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 తర్వాత వరంగల్​ సభకు హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం వరంగల్ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. కట్రీయా హోటల్​లో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. రాత్రి 8 తర్వాత తిరిగి ఢిల్లీకి బయల్దేరుతారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Panda Envoys : చైనా, అమెరికా మధ్యలో పాండా.. ఎందుకు ?