Site icon HashtagU Telugu

Heavy Rains : ఏపీకి బిగ్ షాక్ ..నవంబర్ లో మరో మూడు తుఫాన్లు..!!

Montha Cyclone Effect Telug

Montha Cyclone Effect Telug

బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం బలహీనమై అల్పపీడనంగా మారిందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదిలి, నేటి ఉదయానికి తన శక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. అయితే, దీని ప్రభావం పూర్తిగా తగ్గలేదని, సముద్రం మీద మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. దీని కారణంగా వచ్చే 12 గంటల్లో ఉత్తర తీర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. అదే సమయంలో దక్షిణ తీర ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Sardar Vallabhbhai Patel: నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి!

ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉత్తర ఆంధ్ర జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమల్లో గాలులు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్ర యాత్రలకు దూరంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని అధికారుల సూచన. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున చెట్ల కింద నిలబడరాదని, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు. రైతులు తమ పంటల సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా తడి నేలల్లో పనిచేసే సమయంలో పిడుగుల భయం నుంచి రక్షణ చర్యలు పాటించాలని సూచించారు.

Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర

ఇక వాతావరణ నిపుణుల ప్రకారం.. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని తెలిపారు. దీని ప్రభావంతో నవంబర్ నెలలో మరో రెండు లేదా మూడు తుఫానులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో తుఫానులు రావడం సహజమేనని, కానీ ముందస్తు హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉంటే పెద్ద నష్టాలను నివారించవచ్చని అధికారులు అన్నారు. సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు వర్షపాతం కొనసాగింపునకు దోహదపడతాయని, వచ్చే వారం మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అందువల్ల, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగవచ్చని సూచనలున్నాయి.

Exit mobile version