శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రి కమ్ మెడికల్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. మహిళా సర్జన్ పై అసిస్టెంట్ ప్రొఫెసర్ రమేష్ లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయాన్ని హౌస్ సర్జన్ డీఎంఈకి ఫిర్యాదు చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ రమేష్పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆరోపణలు నేపథ్యంలో రిమ్స్ కళాశాల ప్రిన్సిపాల్ వి.వెంకట చలం, రిమ్స్ ఆసుపత్రి డెవలప్మెంట్ అడ్వైజరీ బోర్డు సభ్యుడు వి.విజయకుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ను సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించడంతో ఆ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ శనివారం సెలవుపై వెళ్లారు .ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని డిఎంఈ.. రిమ్స్ ప్రిన్సిపాల్ను ఆదేశించారు. గతంలో ఈ వేధింపులపై హౌస్ సర్జన్ రిమ్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు కొనసాగించారు. వేధింపులు భరించలేక హౌస్ సర్జన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.