Farmer Registry : ఫార్మర్ రిజిస్ట్రీలో ఏపీకి నాలుగో స్థానం – వ్యవసాయ శాఖ

Farmer Registry : దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ యోజన (PM-KISAN) కింద లబ్ధిదారుల నమోదు ప్రక్రియ జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 60 లక్షల మంది లబ్ధిదారులు నమోదయ్యారు

Published By: HashtagU Telugu Desk
Ap State

Ap State

ఫార్మర్ రిజిస్ట్రీ(Farmer Registry)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (AP)దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ సేనాపతి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ యోజన (PM-KISAN) కింద లబ్ధిదారుల నమోదు ప్రక్రియ జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 60 లక్షల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇందులో 42 లక్షల మందికి ప్రత్యేక గుర్తింపు నంబర్ (Unique ID) జారీ చేయగా, మిగతా 3 లక్షల మంది వివరాలను త్వరలో పూర్తిచేయనున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.182 కోట్ల గ్రాంట్‌ను సాధించేందుకు కృషి చేస్తోంది.

Ramzan 2025: సౌదీలో నేడే రంజాన్.. రేపు భారత్‌లో ఈద్

రాష్ట్ర వ్యాప్తంగా రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 80% లక్ష్యాన్ని అధిగమించామని, ముఖ్యంగా తూర్పు గోదావరి మరియు శ్రీకాకుళం జిల్లాలు 78% నమోదు పూర్తి చేసి ముందున్నాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ప్రభుత్వం రైతులకు మెరుగైన సేవలను అందించేందుకు కొత్త పథకాలు అమలు చేస్తోంది. ఈ రిజిస్ట్రీ ద్వారా రైతుల పూర్తి వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది భవిష్యత్తులో వ్యవసాయ సంబంధిత సబ్సిడీలు, రుణ సదుపాయాలు, భీమా పథకాల అమలుకు ఉపయోగపడనుంది.

ఇదే సమయంలో నెల్లూరు మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రైతుల నమోదు ప్రామాదంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో నమోదు శాతం తక్కువగా ఉండటంతో, అక్కడ అవగాహన కార్యక్రమాలను మరింత విస్తరించనున్నామని వ్యవసాయ శాఖ పేర్కొంది. రైతులందరికీ ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని చూస్తోంది. దీనివల్ల రాష్ట్రంలోని రైతుల అభివృద్ధికి మరింత తోడ్పాటును అందించవచ్చని వ్యవసాయ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

  Last Updated: 30 Mar 2025, 10:55 AM IST