Site icon HashtagU Telugu

MLA Quota MLC Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఎవరంటే ..

Mlc Ap

Mlc Ap

ఆంధ్రప్రదేశ్ (AP) లో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు (MLA Quota MLC Elections) అభ్యర్థులను ఎన్డీయే కూటమి ఖరారు చేసింది. టీడీపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించారు. టీడీపీ సీనియర్ నేత సి. రామచంద్రయ్యతో పాటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యదర్శి అయిన పిడుగు హరిప్రసాద్ పేర్లు ఖరారు చేశారు. సి. రామచంద్రయ్య, పిడుగు హరి ప్రసాద్‌లు కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మంగళవారం (జులై 2న) నామినేషన్ దాఖలు చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గత నెలలో షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 25న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా.. జులై 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జులై 3న అభ్యర్థుల ఆ నామినేషన్లను పరిశీలించనున్నారు. అభ్యర్థులు జులై 5 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. జులై 12న ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహించి, అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు.

ఇక ఏపీ అసెంబ్లీలో టీడీపీ కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూటమికే దక్కనున్నాయి. దీంతో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండకపోవచ్చు. మరోవైపు సి. రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ ఏపీ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. రామచంద్రయ్య ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారటంతో మండలి ఛైర్మన్ ఆయనపై అనర్హత వేటు వేశారు. ఇక మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేయటంతో ఆయన స్థానం కూడా ఖాళీ అయ్యింది. ఈ రెండు స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Read Also : Ramprasad Reddy Wife : మంత్రి రాం ప్రసాద్ రెడ్డి భార్య తీరుపై సీఎం బాబు ఆగ్రహం