Liquor Price : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా పెంచిన మద్యం ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా సామాన్యుల కోసం అందుబాటులోకి తెచ్చిన రూ. 99 మద్యం బాటిల్, బీర్లు మినహా మిగతా అన్ని బ్రాండ్లకు, సైజుతో సంబంధం లేకుండా, రూ. 10 చొప్పున ధరలు పెంచారు. దీంతో మందుబాబుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా ధరలు పెంచడం అన్యాయం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మందుబాబుల ఆగ్రహం, గందరగోళం
తమకి తెలియకుండానే మద్యం ధరలు పెరగడంతో మద్యం షాపుల వద్ద మందుబాబులు షాక్కు గురయ్యారు. కొందరు నిర్వహకులతో వాగ్వాదానికి దిగగా, మరికొందరు ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పెంచడం ఏంటని మండిపడ్డారు. పలు ప్రాంతాల్లో పాత ధరలు ఉన్న పట్టికలు మార్చకపోవడంతో కస్టమర్లు మరింత కన్ఫ్యూజ్ అవుతున్నారు.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో మద్యం ధరలను రూ. 15 నుంచి రూ. 20 వరకు పెంచారని ప్రచారం జరుగుతోంది. అయితే, అవి అసత్య ప్రచారాలే అంటూ నిర్వాహకులు ఖండిస్తున్నారు. మద్యం బ్రాండ్, సైజు సంబంధం లేకుండా ప్రతి బాటిల్పై కేవలం రూ. 10 మాత్రమే పెంచినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Elephant Idols: ఇంట్లో ఏనుగు బొమ్మ ఉంటే అదృష్టం కలిసివస్తుందా.. పండితులు ఏం చెబుతున్నారంటే!
మద్యం పాలసీలో మార్పులు – ప్రైవేట్ షాపులకు అవకాశం
గత ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన సర్కారు లిక్కర్ షాపులకు స్వస్తి పలికి, ఎన్డీయే కూటమి ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపుల నిర్వహణ హక్కును టెండర్ల విధానంలో కట్టబెట్టింది.
ఇటీవల, మద్యం షాపుల నిర్వాహకులు తమ మార్జిన్ తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేయడంతో, ప్రభుత్వం కమిషన్ను 14.5 శాతం నుంచి 20 శాతానికి పెంచేందుకు అనుమతి ఇచ్చింది. 2019-24 కాలంలో గత ప్రభుత్వం అమలు చేసిన ఎక్సైజ్ విధానాలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం సమీక్షించింది. అనంతరం, రిటైల్ వ్యాపారం, మద్యం ధరలు, పన్నుల విధానాలను పరిశీలించేందుకు ఎక్సైజ్ శాఖ ‘వే ఫార్వర్డ్’ రూపకల్పన చేసింది.
కేబినెట్ సబ్-కమిటీ సిఫార్సులు – మద్యం ధరల పెంపు
మద్యం రంగంలో సమర్థవంతమైన పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కేబినెట్ సబ్-కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రిటైలింగ్, ధరల నిర్ణయం, పన్నుల విధానం వంటి అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ సిఫార్సుల ఆధారంగా, మద్యం రిటైలింగ్, ప్రైసింగ్, పన్నులపై కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రభుత్వం ఆమోదించింది. దీంతో, మద్యం ధరలు సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా, పెంచిన ధరలను అమలు చేయాలని అధికారికంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం, ఇవాళ్టి నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయి.
Maha Kumbh Padayatra : రివర్స్లో నడుస్తూ మహా కుంభమేళాకు.. నేపాలీ దంపతుల భక్తియాత్ర