AP Inter Result 2024: ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు రేపే విడుదల

ఇంటర్మీడియట్​ పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఎట్టకేలకు ఇంటర్ బోర్డు రేపు ప్రకటించనుంది. ప్రథమ, ద్వితీయ పరీక్షలకు హాజరైన విద్యార్థులు శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఫలితాలను చూసుకోవచ్చు

AP Inter Result 2024: ఇంటర్మీడియట్​ పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఎట్టకేలకు ఇంటర్ బోర్డు రేపు ప్రకటించనుంది. ప్రథమ, ద్వితీయ పరీక్షలకు హాజరైన విద్యార్థులు శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఫలితాలను చూసుకోవచ్చు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించగా, మొత్తం 10,53,435 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 5,17,570 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరు కాగా, 5,35,865 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు.

We’re now on WhatsAppClick to Join

పరీక్ష పేపర్లలో ఎలాంటి లీకేజీలు జరగకుండా ఇంటర్ బోర్డు విస్తృత చర్యలు చేపట్టింది. ప్రతి ప్రశ్నాపత్రం భద్రత కోసం క్రమ సంఖ్యలు మరియు ప్రత్యేకమైన బార్ కోడ్‌ని రూపొందించింది. కాగా విద్యార్థులు ఇంటర్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 22 రోజుల్లోపు ఫలితాలను ప్రకటించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా ఇంటర్ బోర్డు యాజమాన్యంపై ప్రశంసలు కురిపిస్తుంది. విద్యార్థులకు సకాలంలో ఫలితాలను అందించడంలో వారి నిబద్ధతను తెలియజేస్తుంది. కాగా ఇంటర్​ పరీక్షల ఫలితాలను www.bie.ap.gov.in అధికార వైబ్​సైట్​ ద్వారా తెలుసుకోవచ్చు.

Also Read: Tattoos : టాటూలను 15 రోజుల్లోగా తొలగించాలి..పోలీసులకు ఆదేశం